Allu Arjun : పుష్ప సినిమా తో అల్లు అర్జున్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. అతడి పాన్ ఇండియా క్రేజ్ తో ముందు ముందు చేయబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే అవ్వబోతున్నాయి. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ మరింతగా పెరుగుతుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. అందుకే లైకా ప్రొడక్షన్స్ వారు అల్లు అర్జున్ తో ఏకంగా వంద కోట్లకు గాను ఒప్పందం చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయమై బన్నీ పీఆర్ టీమ్ అనధికారికంగా స్పందించింది. లైకా ప్రొడక్షన్స్ లో బన్నీ సినిమా కమిట్ అయ్యి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ను వాయిదా వేస్తు వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా ను చేసేందుకు వారు కథ ను సిద్దం చేయిస్తున్నారు.
సినిమా కమిట్ అయిన సమయంలో పారితోషికంను గురించి చర్చ ఉండదు. అడ్వాన్స్ గా మాత్రం కొంత మొత్తంను ఇవ్వడం జరిగింది. కనుక పారితోషికంను మొత్తంగా సినిమా పట్టాలెక్కే సమయంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. సినిమా ప్రారంభం అయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కనుక పారితోషికం గురించి ఇప్పటి నుండే చర్చ జరిగే అవకాశం లేదు అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. అయితే బన్నీకి వంద కోట్ల పారితోషికం స్థాయి ఉంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు కాకున్నా సినిమా ప్రారంభం అయ్యే సమయంకు అయినా కూడా లైకా వారు పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నందుకు గాను బన్నీకి వంద కోట్ల పారితోషికంను ఇవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప రెండు పార్ట్ లకు కలిపి ఇప్పటికే పారితోషికం కమిట్ అయ్యాడు. బల్క్ అమౌంట్ తో పాటు లాభాల్లో వాటాను బన్నీ దక్కించుకుంటున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఇప్పటికే పుష్ప సినిమా కు గాను భారీ మొత్తాన్ని దక్కించుకున్నాడు అనేది టాక్. ఇప్పుడు పుష్ప 2 కు కూడా పారితోషికం తో పాటు లాభాల్లో వాటా కూడా ఉంటుంది. సినిమా కనుక మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఒక్క పుష్ప రెండు పార్ట్ లతో బన్నీ ఖాతాలో రెండు వందల కోట్లకు పైగా పారితోషికం పడ్డట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మరియు తమిళ స్టార్ లు విజయ్ లు మాత్రమే వంద కోట్ల పారితోషింకను అందుకుంటున్నారు. ఇప్పుడు బన్నీ ఆ స్థాయి పారితోషికం అందుకోవడం రికార్డు గా చెప్పుకోవచ్చు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.