Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!
Anchor Shyamala : యాంకర్ శ్యామల ఈ మధ్య నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చింది. కొందరు వైసీపీ నేతల తరఫున ప్రచారం కూడా చేసింది. అందుకు ఆమె ఏం ఆశించిందో ఎవరికీ తెలియదు. అయితే శ్యామల ఇలా వైసీపీకి సపోర్టు చేయడంతో చాలా మంది ప్రతిపక్ష వర్గాలు ఆమెపై తీవ్రంగా మండిపడ్డాయి. ఆమెను చాలా టార్గెట్ చేశాయి. ఇక టీడీపీ, జనసేనకు చెందిన ఓ వర్గం అయితే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. దాంతో ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉండిపోయిందని చెప్పుకోవాలి.
ఇదిలా ఉండగా మొన్న ఆదివారం నాడు బెంగుళూరులో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారనే ప్రచారం జరిగింది. ముందుగా నటి హేమ, హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే తాను ఆ పార్టీలో లేనంటూ హీరో శ్రీకాంత్ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అటు నటి హేమ కూడా ముందుగా తాను ఆ పార్టీలో లేనని చెప్పింది. కానీ చివరకు అడ్డంగా దొరికిపోయింది. ఆ పార్టీలో ఆమె కూడా ఉందని పోలీసులే స్వయంగా చెప్పారు. కానీ జానీ మాస్టర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇక యాంకర్ శ్యామల కూడా ఈ పార్టీలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువగా టీడీపీ కూటమికి చెందిన ఓ వర్గం బాగా ప్రచారం చేసింది. దాంతో ఈ ప్రచారంపై యాంకర్ శ్యామల ఘాటుగా స్పందిచింది. ఆమె మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశానని తెలిపింది. తాను ఇప్పటి వరకు అలాంటి పార్టీలకు వెళ్లలేదని.. వెళ్లే అలవాటు కూడా లేదంటూ స్పష్టం చేసింది.
Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!
కావాలనే కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడింది శ్యామల. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని స్పష్టం చేసింది. దాంతో ఆమె ఆ పార్టీలో లేదని క్లారిటీ వచ్చేసింది. కాగా ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరున్నానేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నా ఎవరూ పెద్దగా స్పందించట్లేదు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.