Categories: EntertainmentNews

Kadambari : కాదంబరి జత్వానీ కేసు.. వెలుగులోకి మ‌రో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌

Kadambari : ఏపీలో ముంబై న‌టి కాదంబరి జత్వానీ కేసు ఎంత ప్ర‌కంప‌న‌లు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటి కాదంబరీ జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్​లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్ కు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సహకరించారని బాధితురాలు ఆరోపించారు. దీంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధితురాలు చేస్తున్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

Kadambari కొత్త మ‌లుపు..

ఓ పారిశ్రామికవేత్త తనపై అత్యాచారం చేశారని జత్వానీ బాంద్రా కర్రా కాంప్లెక్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 2023 డిసెంబర్ 17న ఆ పారిశ్రామికవేత్తపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించాలి. అయితే ఆ సమయంలో ఆమె పోలీసులకు ఆధారాలను సమర్పించలేదు. ఈ ఆధారాలను సమర్పించాల్సిన సమయంలో జత్వానీ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టై జైల్లో ఉన్నార.ఇదిలా ఉంటే పోలీసు కస్టడీలో ఆమెతో ఐ ఫోన్లను తెరిపించేందుకు పీఎస్సార్‌ ఆంజనేయుల ఆదేశాల మేరకు కాంతిరాణా, విశాల్‌ గున్నీ తీవ్రంగా ప్రయత్నించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఫోన్లను తెరిచేందుకు కాదంబరి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్‌ కుమార్‌ సింగ్‌ ను విజయవాడ తీసుకొస్తే.. ఆమె కంగారులో ఫోన్ల లాక్‌ ఓపెన్‌ చేస్తుందని కాంతిరాణా, విశాల్‌ గున్నీలకు కుక్కల విద్యాసాగర్‌ సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

Kadambari : కాదంబరి జత్వానీ కేసు.. వెలుగులోకి మ‌రో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌

త‌ప్పుడు కేసుతో కాదంబరి సన్నిహితుడు అమిత్‌ కుమార్‌ ను అరెస్టు చేసేందుకు నలుగురు సభ్యుల పోలీసుల బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ పోలీసు బృందం ఢిల్లీ వెళ్లేందుకు నాటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గా ఉన్న కాంతిరాణా కార్యాలయం నుంచి విమాన టికెట్లు బుక్‌ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్‌ సింగ్‌ జాడ దొరకలేదని త‌మ నివేదిక‌లో చెబుతున్నాయి. ఈలోగా కాదంబరి, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని టాక్ న‌డుస్తుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago