Kadambari : కాదంబరి జత్వానీ కేసు.. వెలుగులోకి మరో ఆసక్తికర సంఘటన
Kadambari : ఏపీలో ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఎంత ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటి కాదంబరీ జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్ కు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సహకరించారని బాధితురాలు ఆరోపించారు. దీంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధితురాలు చేస్తున్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఓ పారిశ్రామికవేత్త తనపై అత్యాచారం చేశారని జత్వానీ బాంద్రా కర్రా కాంప్లెక్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 2023 డిసెంబర్ 17న ఆ పారిశ్రామికవేత్తపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించాలి. అయితే ఆ సమయంలో ఆమె పోలీసులకు ఆధారాలను సమర్పించలేదు. ఈ ఆధారాలను సమర్పించాల్సిన సమయంలో జత్వానీ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టై జైల్లో ఉన్నార.ఇదిలా ఉంటే పోలీసు కస్టడీలో ఆమెతో ఐ ఫోన్లను తెరిపించేందుకు పీఎస్సార్ ఆంజనేయుల ఆదేశాల మేరకు కాంతిరాణా, విశాల్ గున్నీ తీవ్రంగా ప్రయత్నించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఫోన్లను తెరిచేందుకు కాదంబరి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ ను విజయవాడ తీసుకొస్తే.. ఆమె కంగారులో ఫోన్ల లాక్ ఓపెన్ చేస్తుందని కాంతిరాణా, విశాల్ గున్నీలకు కుక్కల విద్యాసాగర్ సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
Kadambari : కాదంబరి జత్వానీ కేసు.. వెలుగులోకి మరో ఆసక్తికర సంఘటన
తప్పుడు కేసుతో కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ ను అరెస్టు చేసేందుకు నలుగురు సభ్యుల పోలీసుల బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ పోలీసు బృందం ఢిల్లీ వెళ్లేందుకు నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాణా కార్యాలయం నుంచి విమాన టికెట్లు బుక్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదని తమ నివేదికలో చెబుతున్నాయి. ఈలోగా కాదంబరి, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని టాక్ నడుస్తుంది.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.