Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు ఇటీవల కాలంలో చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఒకే హీరో మూడు నుంచి నాలుగు పాత్రలు సులువుగా పోషించిన రోజులున్నాయి. అయితే, NTR, ANR హయాంలో మాత్రం చాలా సినిమాల్లో ఈ అగ్రనటులు ఇద్దరు కలిసి వెండితెరపై మెరిసారు. అభిమానులు ఒప్పించి మరీ మెప్పించారు. బాక్సాఫీసులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు ఒకే సినిమాలో ఇంతవరకు కనిపించలేదు. వీరికి తెలుగు రాష్ట్రాల్లో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. వీరిద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.
కానీ ఇంతవరకు మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి సినిమాలు చేయలేదు.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకుడు రాజమౌళి నందమూరి, మెగాస్టార్ అభిమానులకు ఒకేసారి కిక్కిచ్చేందుకు సిద్దమయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వెండి తెరపై కనిపించనున్నారు. అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో.. కుర్ర హీరోలు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు సరే.. మరి బాలయ్య, చిరంజీవి ఎప్పుడు వెండితెరపై కలిసి నటిస్తారని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే గనుక జరిగితే ఇప్పటివరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని తుడిచిపెట్టుకోవడం ఖాయమని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా కీలక ప్రకటన చేసింది
మెగాస్టార్ ఫ్యామిలీకి, అటు నందమూరి ఫ్యామిలీ మాస్ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. వీరిద్దరితో కలిసి సినిమా చేసేందుకు తాము సిద్ధమని, అందుకు మంచి కథ దొరికితే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ ఒక్క మాటతో నందమూరి, మెగా ఫ్యాన్స్కు ఆశలు చిగురించాయి. నిజంగా చిరు, బాలయ్య వెండి తెరను పంచుకుంటే బాక్సాఫీస్ బద్దలు అవ్వక తప్పదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే, కథ విషయంలో మాత్రం ఇద్దరు హీరోలకు ఎక్కడా తక్కువ చేసి చూపించకుండా సినిమా తీయడం అంటే దర్శకులకు అగ్నిపరీక్షే.. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో మరో కొత్త యుద్ధం మొదలవుతుందని దర్శకులు కూడా భయపడుతున్నారట.. బాలయ్య చిరు కలిసి నటిస్తే అభిమానులు మాత్రం కాలర్ ఏగరేయడం మాత్రం ఖాయం..
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.