
bigg boss telugu 7 winner pallavi prashanth
Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన తర్వాత ఇది చాలా క్లోజ్ కాల్. మీ ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. ఇద్దరి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున. అయితే.. పల్లవి ప్రశాంత్ నే విన్నర్ ను చేయాలని బిగ్ బాస్ ముందే డిసైడ్ అయ్యాడా? అసలు ఎక్కువ ఓట్లు వచ్చింది పల్లవి ప్రశాంత్ కు కాదని.. అమర్ దీప్ కే అని అమర్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినా కూడా ఆయన ఫ్యాన్స్ ఎందుకు అమర్ ను టార్గెట్ చేశారు. అసలు అమర్ చేసిన తప్పేంటి. బిగ్ బాస్ పేరుతో రోడ్డు మీద ఈ రచ్చ ఏంది. పబ్లిక్ ను డిస్టర్బ్ చేయడం ఏంటి. పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజీ చేయడం ఏంటి. అసలు ఏంది ఇది బిగ్ బాస్. ఇదంతా నువ్వు చూస్తున్నావా? ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేస్తున్నారు. ఈసమయంలో హోస్ట్ నాగార్జున ఎక్కడికెళ్లారు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అయితే.. దానికంటే ముందు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య గొడవ. నిజానికి డే వన్ నుంచి పల్లవి ప్రశాంత్ ను అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి ఈ ముగ్గురు టార్గెట్ చేశారు. ఆ తర్వాత సందీప్ మాస్టర్, గౌతమ్ కూడా టార్గెట్ చేశారు. ఒక్క శివాజీ, యావర్ తప్ప మిగితా వాళ్లంతా హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసిన వాళ్లే. దానికి కారణం.. పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్. సాధారణ వ్యక్తి సెలబ్రిటీల మధ్య హౌస్ లో 105 రోజులు ఉండి చివరికి విజేత కావడం అనేది మామూలు విషయం కాదు. అది గ్రేట్ అనే చెప్పుకోవాలి. అయితే.. పల్లవి ప్రశాంత్ ను బిగ్ బాస్ విజేతను చేయాలని ముందే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ కు తొలి కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్.. తను సరిగ్గా కెప్టెన్సీ చేయలేదని చెప్పి ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేస్తాడు బిగ్ బాస్. అప్పుడు కానీ తెలియలేదు బిగ్ బాస్ కి పల్లవి ప్రశాంత్ కు బయట ఉన్న క్రేజ్. వెంటనే అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద చాలా గొడవ చేశారు. రచ్చ రచ్చ చేశారు. నానా యాగీ చేశారు. దీంతో బిగ్ బాస్ మళ్లీ పల్లవి ప్రశాంత్ ను కెప్టెన్ ను చేశాడు. దీంతో ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే.. పల్లవి ప్రశాంత్ కు వ్యతిరేకంగా బిగ్ బాస్ ఏ పని చేసినా.. అది రివర్స్ కొట్టి బిగ్ బాస్ షోకే మచ్చ తెచ్చే అవకాశం ఉందని బిగ్ బాస్ యాజమాన్యం ముందే గ్రహించింది. అందులోనూ ప్రశాంత్ కూడా తన ఆట తీరును మెరుగుపరుచుకొని రోజురోజుకూ రాటుతేలాడు. టాప్ 5 లో చోటు కూడా సంపాదించుకున్నాడు.
ఒకవేళ ప్రశాంత్ కు తక్కువ ఓట్లు వచ్చినా ప్రశాంత్ ను కాకుండా అమర్ దీప్ ను విన్నర్ ను చేస్తే ఇక మామూలుగా ఉండేది కాదు రచ్చ. ఎందుకంటే.. బిగ్ బాస్ యాజమాన్యం అమర్ దీప్ ను విన్నర్ ను చేయాలని ముందే అనుకుందట. కానీ.. అమర్ దీప్ కు మధ్యలో పల్లవి ప్రశాంత్ వచ్చేశాడు. అందులోనూ హౌస్ లో ప్రతి సారి పల్లవి ప్రశాంత్ ను అమర్ దీప్ చిన్నచూపు చూడటం, తిట్టడం, రైతు అయితే ఏంటి.. రైతు బిడ్డ అయితే ఏంటి అంటూ రైతులను కూడా చిన్నచూపు చూడటంతో బయట జనాలు కూడా సీరియస్ గా తీసుకున్నారు. అమర్ దీప్ పై ప్రశాంత్ ఫ్యాన్స్ పగ పెంచుకున్నారు. ఇప్పుడు అమర్ దీప్ ను విన్నర్ ను చేస్తే బయట అమర్ దీప్ పని అయిపోయేది. అసలు ప్రశాంత్ విన్నర్ అయినా కూడా అమర్ రన్నర్ అయినా కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ బయట ఎంత రచ్చ చేశారో తెలుసు కదా. అమర్ కారు అద్దాలను పగులగొట్టారు. ఒకానొక సమయంలో రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని అమర్ తలదాచుకున్నాడు అంటే.. అమర్ పై ప్రశాంత్ ఫ్యాన్స్ ఎంత కక్ష కట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బిగ్ బాస్ ముందే ఊహించి.. ఒకవేళ అమర్ కు ఎక్కువ ఓట్లు వచ్చినా అమర్ ను విన్నర్ ను చేస్తే ప్రశాంత్ ఫ్యాన్స్ పెంట పెంట చేస్తారని.. బిగ్ బాస్ మీద ఉన్న నమ్మకం కూడా జనాల్లో పోతుందని.. అందుకే ప్రశాంతనే చేసేస్తే పోలా అన్నట్టుగా అమర్ ను తప్పని సరి పరిస్థితుల్లో రన్నర్ ను చేసినట్టుగా కనిపిస్తోంది. చివర్లో అసలు ట్విస్ట్ నాగ్ రివీల్ చేయడంతో అసలు విన్నర్ అమర్ అని స్టేజీ మీదనే తేలిపోయింది. ఇది క్లోజ్ కాల్. ఓట్ల శాతం మీ ఇద్దరి మధ్య చాలా తక్కువ అని చెప్పినప్పుడే ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అసలు విన్నర్ అమర్ కానీ.. ప్రశాంత్ కాదని. ఏది ఏమైనా ప్రశాంత్ కూడా హౌస్ లో చాలా కష్టపడ్డాడు. టాప్ పొజిషన్ సాధించాడు. కానీ.. ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఇంతలా రచ్చ చేయకుండా ఉండాల్సింది. అది ప్రశాంత్ కే బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.