Nagababu : మరోసారి మంత్రి రోజాపై రెచ్చిపోయిన నాగబాబు ..!
Nagababu : తనకు రెండు ఓట్లు ఉన్నాయి అన్న వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందించారు. వివాదాస్పదం అవడం ఇష్టం లేకనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు అన్నారు. ఏపీ తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం పై నాగబాబు పై వివాదాస్పదం అయింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల నాగబాబు కుటుంబం ఖైరతాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని మంగళగిరిలో ఆయన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ వివాదం పై స్పందించిన నాగబాబు హైదరాబాదులో తనకున్న ఓటు రద్దు చేసుకున్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. తన ఓటును ఏపీకి మార్చుకుని టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీ వాళ్లు కావాలని దీనిని వివాదం చేస్తున్నారు అని నాగబాబు అన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాజకీయాలకు సంబంధించిన ఓ కామెడీ మ్యాగజైన్ వార్త రాసిందని సెటైర్స్ వేశారు. తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నామని, మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓట్లు రాకుండా బూత్ స్థాయిలోను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు.
ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన అంటే అపహాస్యంగా ఉందని, చివర్లో నోట్ లు ఇస్తే ఓట్లు వేస్తారని గుడ్డి నమ్మకంతో ఉన్నారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన, టిడిపి కలిసి ప్రజా సమస్యలకే పోరాడుతామని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన, టీడీపీ కూటమిని గెలిపించాలని అన్నారు. అధికార పార్టీ వాళ్లు మళ్లీ తామే గెలుస్తామని అహంకారంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అన్నారు.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.