
Nagababu : మరోసారి మంత్రి రోజాపై రెచ్చిపోయిన నాగబాబు ..!
Nagababu : తనకు రెండు ఓట్లు ఉన్నాయి అన్న వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందించారు. వివాదాస్పదం అవడం ఇష్టం లేకనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు అన్నారు. ఏపీ తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం పై నాగబాబు పై వివాదాస్పదం అయింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల నాగబాబు కుటుంబం ఖైరతాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని మంగళగిరిలో ఆయన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ వివాదం పై స్పందించిన నాగబాబు హైదరాబాదులో తనకున్న ఓటు రద్దు చేసుకున్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. తన ఓటును ఏపీకి మార్చుకుని టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీ వాళ్లు కావాలని దీనిని వివాదం చేస్తున్నారు అని నాగబాబు అన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాజకీయాలకు సంబంధించిన ఓ కామెడీ మ్యాగజైన్ వార్త రాసిందని సెటైర్స్ వేశారు. తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నామని, మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓట్లు రాకుండా బూత్ స్థాయిలోను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు.
ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన అంటే అపహాస్యంగా ఉందని, చివర్లో నోట్ లు ఇస్తే ఓట్లు వేస్తారని గుడ్డి నమ్మకంతో ఉన్నారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన, టిడిపి కలిసి ప్రజా సమస్యలకే పోరాడుతామని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన, టీడీపీ కూటమిని గెలిపించాలని అన్నారు. అధికార పార్టీ వాళ్లు మళ్లీ తామే గెలుస్తామని అహంకారంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అన్నారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.