Categories: EntertainmentNews

Bigg Boss Telugu 8 : ఆ కంటెస్టెంట్‌కి అలా బ్రేక్ ప‌డింది.. మూడు నెల‌ల్లో బాగానే సంపాదించిన‌ట్టున్నాడు.!

Advertisement
Advertisement

Bigg Boss Telugu 8 : బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ 13వ వారం రెండు ఎలిమినేష‌న్స్ జ‌రిగాయి. ముందు రోజు టేస్టి తేజ ఎలిమినేట్ కాగా, ఆ త‌ర్వాత పృథ్వీరాజ్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో పృథ్వీరాజ్‌ ఎలిమినేట్‌ అయినట్టు హోస్ట్ నాగార్జున తెలిపారు. విష్ణుప్రియాతో కలిసి ఫైనల్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియలో పాల్గొన‌గా, పృథ్వీరాజ్‌ ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ని వీడుతున్నట్టు నాగ్‌ వెల్లడించారు. అయితే పృథ్వీకంటే ముందుగా ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ తెలుగు 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ టేస్టీ తేజ 2 నెలలకు గానూ రూ. 12 లక్షలు లేదా రూ. 32 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం .

Advertisement

Bigg Boss Telugu 8 : ఆ కంటెస్టెంట్‌కి అలా బ్రేక్ ప‌డింది.. మూడు నెల‌ల్లో బాగానే సంపాదించిన‌ట్టున్నాడు.!

Bigg Boss Telugu 8 ఇంత వివ‌క్ష ఎంద‌కు ?

ఇక బిగ్ బాస్ హౌజ్‌లో యారగంట్‌గా, రౌడీలా బిహేవ్ చేసిన పృథ్వీరాజ్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు నానా ర‌చ్చ చేశారు. బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్ హౌజ్‌లో దాదాపుగా 91 రోజులు ఉన్నాడు. అంటే, సరిగ్గా 3 నెలల (13 వారాలు) వరకు హౌజ్‌లో అలరించాడు. బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు పృథ్వీ రోజుకు రూ. 18,572 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అంటే, వారానికి రూ. లక్షా 30 వేలు. ఈ లెక్కన 13 వారాలకు పృథ్వీరాజ్ సుమారుగా రూ. 16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఎలిమినేట్‌ అయిన బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైకి వ‌చ్చిన‌ పృథ్వీరాజ్‌… తన జర్నీ చూసుకుని ఎమోషనల్‌ అయ్యారు. అనంతరం నాగ్‌.. హౌజ్‌లో ఎవరు సూపర్‌ హిట్‌, ఎవరు సూపర్‌ ఫ్లాప్‌ అని చెప్పాలన్నారు.

Advertisement

అందులో నిఖిల్‌, విష్ణు ప్రియా, నబీల్‌లకు సూపర్‌ హిట్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. రోహిణి, అవినాష్‌లకు సూపర్‌ ఫ్లాప్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. వీరిద్దరు నామినేషన్‌లోకి రావాలని, ఆడియెన్స్ జడ్జ్ మెంట్‌ తీసుకోవాలన్నారు. అవినాష్‌ ఇప్పటికే ఎలిమినేట్‌ కావాల్సి ఉందని, కానీ ఎవిక్షన్‌ షీల్డ్ వల్ల సేవ్‌ అయ్యాడని, ఇప్పుడు ఫైనల్‌కి వెళ్లాడని, ఇంకా బాగా ఆడాలని తెలిపారు పృథ్వీరాజ్‌. అనంతరం ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాను ఎవరికి ఓట్‌ వేస్తానో తెలిపారు. నిఖిల్‌, విష్ణు ప్రియా, నబీల్‌, ప్రేరణలకు తన ఓటు అని ప్రకటించాడు. గౌతమ్‌, అవినాష్‌, రోహిణి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కాబ‌ట్టి వారికి వేయ‌ను అన్న‌ట్టుగా చెప్పాడు. పృథ్వీ.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో తన వివక్షని చూపించాడు. వారికి ఓటు వేయనని ఓపెన్‌గానే ప్రకటించాడు.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

53 minutes ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

3 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

4 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

4 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

6 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

7 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

11 hours ago