Home » News » Karthika Deepam 2 April 1st 2026 Wednesday Episode Highlights
News

Karthika Deepam 2 April 1st 2026 Episode : జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం.. దీపకు ఇదే చివరి రాత్రి?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 1, 2026, 8:54 am
Advertisement

Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. అనుకోని మలుపులతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తోంది. ఏప్రిల్ 1న ప్రసారం కానున్న ఎపిసోడ్ Karthika Deepam 2 April 1st Episode లో భారీ ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. దీపను ఎలాగైనా అంతం చేయాలని జ్యోత్స్న పక్కా స్కెచ్ వేయగా, మరోవైపు పారిజాతం తన ప్రవర్తనతో అందరికీ షాక్ ఇచ్చింది. ఏకంగా అందరి ముందే జ్యోత్స్న చెంప పగలగొట్టి అవాక్కయ్యేలా చేసింది పారిజాతం. మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Karthika Deepam 2 April 1st 2026 Episode : జ్యోత్స్న చెంప పగలగొట్టిన పారిజాతం.. దీపకు ఇదే చివరి రాత్రి?

Karthika Deepam 2 April 1st 2026 Episode జ్యోత్స్న ఆహ్వానం.. అనుమానంలో కార్తీక్ కుటుంబం

ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో.. జ్యోత్స్న గెట్ టుగెదర్ పార్టీ పేరిట కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానించడంపై అనసూయ, కాంచన మధ్య చర్చ జరుగుతుంది. జ్యోత్స్న గురించి అనసూయ మాట్లాడుతూ, “ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రకం జ్యోత్స్న. బహుశా వీలునామా గురించి మళ్లీ పంచాయతీ పెట్టడానికే ఈ పార్టీ ఏర్పాటు చేసిందేమో” అని తన అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి కాంచన బదులిస్తూ, “అన్నయ్య పెట్టిన నిబంధనకు జ్యోత్స్న ఒప్పుకోకపోతే ఆ ఆస్తి కార్తీక్‌కు వస్తుందనే భయం ఆమెలో ఉంది. అయినా పార్టీకి పిలిచారు కదా, వెళ్లడం మన బాధ్యత” అని చెబుతుంది. అయితే, కార్తీక్ మాత్రం జ్యోత్స్న ఆహ్వానం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందనే అనుమానంతోనే ఉంటాడు.

Advertisement

Karthika Deepam 2 April 1st 2026 Episode కాశీ ఆవేదన.. స్వప్న షాక్

మరోవైపు కాశీ తన ప్రేమను వ్యక్తపరచలేక అత్త కావేరి వద్ద బాధపడతాడు. “ఆడవాళ్ల మనసు నాకు అర్థం కాని భాషలా మారింది అత్తయ్య. స్వప్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలని ఉంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా ప్రేమను నేనే మోస్తున్నాను, ఈ ప్రేమను ఎలాగైనా గెలిపించాలి” అని తన ఆవేదనను వెళ్లగక్కుతాడు.

సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న, కాశీకి పెద్ద షాక్ ఇస్తుంది. “రేపు ఉదయం త్వరగా రా కాశీ, మనం గుడికి వెళ్లాలి. వచ్చేటప్పుడు ఒకరిని పికప్ చేసుకోవాలి” అని అంటుంది. ఎవరిని అని కావేరి అడగ్గా, “నాకు కాబోయే భర్త వసంత్‌ను” అని స్వప్న చెప్పడంతో కాశీ, కావేరి ఇద్దరూ అవాక్కవుతారు. “పెళ్లికి ముందు ఒకరినొకరం అర్థం చేసుకోవాలి కదా, అందుకే వసంత్‌ను గుడికి రమ్మన్నాను” అని స్వప్న చెబుతుంది. మనసు ముక్కలైనా బాధను దిగమింగుకున్న కాశీ.. “మీ ఇష్టం మేడం, నేను డ్రైవర్‌ను కదా ఎప్పుడు రమ్మన్నా వస్తాను, ఎవరిని పికప్ చేసుకోమన్నా చేస్తాను” అని చెబుతాడు. కాశీ పరిస్థితి చూసి కావేరి అతనిపై కోప్పడుతుంది. “దానికి బుద్ధి లేదు, నువ్వెందుకు వాళ్లను తీసుకెళ్తావు?” అని అంటుంది. కానీ కాశీ, శ్రీధర్, దాస్ సర్దిచెప్పుకుంటారు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని దాస్ నిర్ణయించుకుంటాడు.

Advertisement

దీపకు ఫోన్ చేసిన జ్యోత్స్న.. ఇదే నీకు చివరి రాత్రి

ఇంట్లో దీప, కార్తీక్ మాట్లాడుకుంటుండగా జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. “రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. బావ నీకు చెప్పాడా? నిన్ను స్పెషల్‌గా ఆహ్వానించాలనే ఫోన్ చేశాను. నీ కోసం ఏమైనా చేస్తా దీప. నువ్వు నీ కుటుంబంతో కలిసి వస్తే అన్నీ మర్యాదలు చేస్తాను. మా బావ భార్యగానే నిన్ను పిలుస్తున్నా, తప్పకుండా రావాలి” అని వెటకారంగా పిలుస్తుంది జ్యోత్స్న. దీప సరేనని చెబుతుంది.

ఫోన్ కట్ చేసిన తర్వాత కార్తీక్ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. “నీ ఇంటికి నువ్వు రాకుండా ఎలా అంటోంది అంటే, దానికి ఏదో నిజం తెలిసుండాలి. కచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తోంది” అని కార్తీక్ అంటాడు. అటు జ్యోత్స్న కూడా తన ప్లాన్ వర్కవుట్ అవుతుందన్న సంతోషంతో, “రేపటితో నా శత్రువు కథ ముగిసిపోతుంది. దీపకు ఇదే చివరి రాత్రి” అని మనసులో అనుకుని పగతో రగిలిపోతుంది.

పారిజాతం ఓవర్ యాక్షన్.. శివన్నారాయణ వార్నింగ్

మరుసటి రోజు ఉదయం నుంచే పారిజాతం ఇంట్లో తెగ హడావుడి చేస్తుంటుంది. దీప కోసం ఆమె అంతలా ఎదురుచూడటం చూసి శివన్నారాయణకు అనుమానం వస్తుంది. “ఎప్పుడూ గుమ్మంలోకి వస్తేనే పట్టించుకోని దానివి, ఇప్పుడు కార్తీక్ ఫ్యామిలీ కోసం ఎందుకింత హడావుడి చేస్తున్నావు?” అని ప్రశ్నిస్తాడు. పారిజాతం ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. శివన్నారాయణ మాత్రం “ఈ పార్టీలో ఎలాంటి తేడా జరక్కూడదు” అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాస్ కూడా పారిజాతం దగ్గరకు వచ్చి, “నువ్వు నిజంగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావమ్మా, ఇలాగైతే సులభంగా దొరికిపోతావు” అని అంటాడు. దానికి పారు, “నా యాక్టింగ్ చూస్తే నాకు అవార్డులు ఇవ్వాల్సిందేరా. మనవరాలికి మర్యాదలు మామూలుగా ఉండకూడదు” అని ఎంతో బిల్డప్ ఇస్తుంది.

దీపపై పారు అతిప్రేమ.. జ్యోత్స్న చెంప పగులింది

కార్తీక్, దీప కుటుంబ సభ్యులతో కలిసి జ్యోత్స్న ఇంటికి చేరుకుంటారు. వాళ్లు రాగానే పారిజాతం పరుగున వెళ్లి వాళ్లకు స్వాగతం పలుకుతుంది. “దీప” అంటూ ఆప్యాయంగా పలకరించి, శౌర్యను దగ్గరకు తీసుకుంటుంది. దీపను చూసి, “మెడ ఎందుకు బోడిగా ఉంది? ఈ నెక్లెస్ తీసుకో” అని తన నెక్లెస్ ఇవ్వబోతుంది. దీప వద్దని సున్నితంగా తిరస్కరిస్తూ “పారిజాతం గారు” అని పిలుస్తుంది. వెంటనే పారు, “పరాయి దానిలా అలా ఎందుకు పిలుస్తావు? నానమ్మ అని పిలువు” అని అనడంతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. జ్యోత్స్న అయితే పారిజాతం ప్రవర్తన చూసి ఆశ్చర్యంతో రగిలిపోతుంది. “ఈ గ్రానీకి ఏమైంది? దీప మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తోంది?” అని తనలో తాను అనుకుంటుంది.

Advertisement

ఇంతలో సుమిత్ర, జ్యోత్స్న తరపున అందరికీ క్షమాపణలు చెబుతుంది. జ్యోత్స్న కూడా కవర్ చేస్తూ, “జరిగిన గొడవలు మర్చిపోదాం. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మన జీవితాల్లోకి ఈ రోజు సరికొత్త వెలుగు తీసుకురావాలి” అని పైకి నటిస్తూ చెబుతుంది.

ఆ తర్వాత పారిజాతం దీప చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అది చూసి జ్యోత్స్నకు మరింత కోపం వస్తుంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత శౌర్యను ఐస్ క్రీమ్ తెచ్చుకోమని పారిజాతం పంపుతుంది. ఐస్ క్రీమ్ కోసం పరుగెడుతూ వెళ్తున్న శౌర్య, అనుకోకుండా జ్యోత్స్నను ఢీకొట్టి కింద పడిపోతుంది.

వెంటనే శౌర్యను పైకి లేపిన పారిజాతం, ఊహించని విధంగా జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది. అందరూ చూస్తుండగానే, “నువ్వు శౌర్యను పడేశావా? నీ కళ్లు ఏమయ్యాయి? చూసి గుద్దినా, చూడకుండా గుద్దినా శిక్ష ఒక్కటే. శౌర్యకు సారీ చెప్పు” అని గట్టిగా అరుస్తూ జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారిజాతం.

తాను అంతలా నమ్ముకున్న గ్రానీ, అందరి ముందు తనను కొట్టడంతో జ్యోత్స్న షాక్‌లో ఉండిపోతుంది. శివన్నారాయణ, సుమిత్రతో సహా అక్కడున్న వారంతా పారిజాతం చేసిన పనికి అవాక్కవుతారు.

Advertisement

అసలు పారిజాతం ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? దీపపై ఈ అకస్మాత్తు ప్రేమ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? జ్యోత్స్న వేసిన స్కెచ్ పారిజాతానికి ఏమైనా తెలిసిందా? ఈ అవమానానికి జ్యోత్స్న ఎలా ప్రతీకారం తీర్చుకోనుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తర్వాతి ఎపిసోడ్‌లలో తెలియనున్నాయి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి