Radhe Shyam : ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిశ్రమ స్పందన లభించింది. తెలుగు లో భారీ ఎత్తున ఓపెనింగ్ దక్కించుకున్న ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి అంటూ అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ మీడియా రాధేశ్యామ్ సినిమాని ప్లాప్ మూవీ అంటూ వార్తలు కథనాలు ఇస్తోంది.బాలీవుడ్ మీడియాలో సినిమా గురించి దారుణమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో వసూలు తగ్గుతున్నాయి
అనేది టాక్. బాలీవుడ్ లో మంచి టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు నమోదైన కూడా అక్కడి మీడియా మాత్రం ప్రభాస్ పై మరియు తెలుగు సినిమా పై కోపంతో తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సాహో సినిమా సాధించిన వసూళ్లలో కనీసం పది శాతం కూడా వసూళ్లు సాధించలేదు అంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అక్కడి మీడియా.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు బాలీవుడ్లో మంచి సక్సెస్ దక్కించుకుని వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే బాలీవుడ్ మీడియా వారు టాలీవుడ్ సినిమాలను విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అక్కడ పెద్ద సినిమాలు ఏమీ రాలేదు.
అయినా కూడా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయాలు చాలా నీరసంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రభాస్ కి సౌత్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారు అదే స్థాయిలో నార్త్ లో కూడా అభిమానులు ఉన్నారు. కనుక ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లను సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ అక్కడ వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానంగా ఉంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చు అనే కామెంట్స్ చేస్తున్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.