
prabhas comments radhe shyam movie
Radhe Shyam : ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిశ్రమ స్పందన లభించింది. తెలుగు లో భారీ ఎత్తున ఓపెనింగ్ దక్కించుకున్న ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి అంటూ అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ మీడియా రాధేశ్యామ్ సినిమాని ప్లాప్ మూవీ అంటూ వార్తలు కథనాలు ఇస్తోంది.బాలీవుడ్ మీడియాలో సినిమా గురించి దారుణమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో వసూలు తగ్గుతున్నాయి
అనేది టాక్. బాలీవుడ్ లో మంచి టాక్ వచ్చినా కూడా మంచి వసూళ్లు నమోదైన కూడా అక్కడి మీడియా మాత్రం ప్రభాస్ పై మరియు తెలుగు సినిమా పై కోపంతో తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సాహో సినిమా సాధించిన వసూళ్లలో కనీసం పది శాతం కూడా వసూళ్లు సాధించలేదు అంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అక్కడి మీడియా.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు బాలీవుడ్లో మంచి సక్సెస్ దక్కించుకుని వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే బాలీవుడ్ మీడియా వారు టాలీవుడ్ సినిమాలను విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అక్కడ పెద్ద సినిమాలు ఏమీ రాలేదు.
bollywood media target prabhas radheshyam movie badly
అయినా కూడా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయాలు చాలా నీరసంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రభాస్ కి సౌత్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారు అదే స్థాయిలో నార్త్ లో కూడా అభిమానులు ఉన్నారు. కనుక ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లను సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ అక్కడ వసూళ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానంగా ఉంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చు అనే కామెంట్స్ చేస్తున్నారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.