Brahmamudi 2 Oct Monday Episode : మైఖేల్ వెనుక ఎవరు ఉన్నారో కావ్య తెలుసుకుంటుందా? కాంట్రాక్ట్ చెక్కును కావ్యకు ఇచ్చిన శీను.. ఆ చెక్కును రుద్రాణి మాయం చేస్తుందా?

Advertisement
Advertisement

Brahmamudi 2 Oct Monday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 2 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 216 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడే వెళ్లి వాళ్ల అంతు చూస్తాను అని ఆవేశపడతాడు రాహుల్. దీంతో అంత అవసరం లేదు రాహుల్.. వాళ్లను పోలీసులకు పట్టించాం అంటుంది కావ్య. అలాంటి వాళ్లను ఉప్పుపాతర వెయ్యాలి. వాడికి అలాంటి ఆలోచన వచ్చిన వాడిని అనాలి అంటూ ఇందిరా దేవి సీరియస్ అవుతుంది. అసలు వాడికి అలాంటి సలహా ఇచ్చిన వాడిని ఏం చేసినా పాపం లేదు అని ఇంట్లో వాళ్లంతా అంటారు. ఆ తర్వాత స్వప్నకు ఏం కాకుండా కాపాడుకున్నాం. ఆ వినాయకుడికి రేపు పూజలు చేద్దాం అంటుంది ఇందిరాదేవి. ఆ తర్వాత రాహుల్.. స్వప్నను తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. మరోవైపు రాహుల్ చెంప చెళ్లుమనిపిస్తుంది రుద్రాణి. ఒక్క పని కూడా సరిగ్గా చేయవా అని సీరియస్ అవుతుంది. విగ్రహాల విషయంలో అలా చేశావు. ఇప్పుడు స్వప్న విషయంలో ఇలా.. అంటూ రాహుల్ పై విరుచుకుపడుతుంది.

Advertisement

నిన్ను అందలం ఎక్కించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగడం లేదు అని బాధపడుతుంది. ఇది మిస్ అవకూడదు.. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని ఎన్నిసార్లు చెప్పాను. కానీ.. తల పగులగొట్టుకొని వచ్చావు అంటుంది రుద్రాణి. ఆ మైఖేల్ గాడి వల్లనే ఇలా జరిగింది అంటాడు. దీంతో నువ్వు ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే ఆ కంపెనీకి నువ్వు రాజు కాదు కదా.. బంటువి కూడా కాలేవు అంటుంది రుద్రాణి. తప్పు జరిగిన ప్రతి సారీ ఆ కావ్య మరింత జాగ్రత్తగా ఉంటోంది. మన దగ్గర ఎక్కువ టైమ్ లేదు. స్వప్న కడుపుతో ఉంది. ఆరో నెల వస్తే కనకం వచ్చి పుట్టింటికి తీసుకెళ్తా అంటుంది. శ్రీమంతం అంటుంది. చివరకు మన చేతుల్లో బాబునో, పాపనో పెడుతుంది. అప్పుడు మనం చేసేది ఏం ఉండదు అంటుంది రుద్రాణి. ఇక అవకాశం కోసం ఎదురు చూడకూడదు.. మనమే ఏదో ఒక దారిని వెతకాలి.. ఆ స్వప్నను వదిలించుకోవాలి అని అంటుంది రుద్రాణి.

Advertisement

#image_title

Brahmamudi 2 Oct Monday Episode : కనకాన్ని పిలవడం కోసం అపర్ణను ఒప్పించిన కావ్య

మరోవైపు కావ్య.. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. మైఖేల్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకుంటుంది కావ్య. ఇంతలో శ్రీను వస్తాడు. మీరు చేసిన హెల్ప్ వల్లే అనుకున్న పని అనుకున్నట్టు పూర్తయింది అంటాడు. చెక్ ఇవ్వడానికి వచ్చాను అంటాడు శీను. కావ్యకు చెక్ ఇచ్చి వెళ్తాడు శీను. చెక్ చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. మార్వాడి వాడికి మీరే చెక్ ఇచ్చి మీ చేతుల మీదుగానే ఇంటి పేపర్లు మా అమ్మానాన్నకు ఇవ్వాలి అని రాజ్ ను అడుగుతుంది. దీంతో ఇవన్నీ నాకెందుకు అంటే.. మీరే చేయాలి అంటుంది. ఆ మార్వాడికి ఫోన్ చేసి రమ్మని చెబుతా అంటుంది కావ్య.

నేను ఇదంతా తన మీద ప్రేమతో చేశానని అనుకుంటోంది కళావతి. కాదు.. తాతయ్య కోసం చేశాను అని తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో అని అనుకుంటాడు రాజ్. మరోవైపు అనామికతో కలిసి కారులో వెళ్తుంటాడు కళ్యాణ్. మీతో కలిసి ఉంటే అస్సలు టైమ్ తెలియడం లేదు అంటుంది అనామిక. రేపు వినాయకచవితి కదా. మా పేరెంట్స్ ను మీ ఇంటికి తీసుకొస్తా.. అంటుంది అనామిక. దీంతో షాక్ అవుతాడు కళ్యాణ్. ఏం కాదు.. అని కళ్యాణ్ కు సర్దిచెబుతుంది అనామిక.

మరోవైపు స్వప్నకు ఇంత జరిగితే నాకు చెప్పవా అని అప్పు.. కనకంపై సీరియస్ అవుతుంది. సమయానికి అక్క, బావ వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేం చేసేదానివి అని అడుగుతుంది అప్పు. నా కూతురు సంతోషంగా ఉండాలని గొప్పింటికి ఇచ్చాను కానీ.. నా కూతురు నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటుంది కనకం. మరోవైపు అప్పుకు కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. దీంతో అవసరం ఉంటే కాల్ చేస్తడా అని ఫోన్ కట్ చేస్తుంది అప్పు. దీంతో మళ్లీ చేస్తాడు. కట్ చేస్తుంటే అర్థం కావడం లేదా.. బిజీ బిజీగా ఉన్నానని.. మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే.. అది కాదు అనామిక అంటూ ఏదో చెప్పబోతాడు. దీంతో నువ్వు, అది కలిసి హుస్సేన్ సాగర్ లో దూకినా.. నాగార్జున సాగర్ ఎక్కినా నాకు అవసరం లేదు అని ఫోన్ కట్ చేస్తుంది.

కట్ చేస్తే కనకానికి.. కావ్య ఫోన్ చేస్తుంది. ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి అని అడుగుతుంది కనకం. నువ్వే కదా కాపాడింది అని అంటుంది కావ్య. శీను డబ్బులు ఇచ్చాడని చెబుతుంది కావ్య. దీంతో ఇదంతా అల్లుడి గారి చలవే అంటుంది కనకం. ఇంటి పేపర్స్ మీ అల్లుడి గారి చేతుల మీదుగా ఇప్పిస్తాను. ఇంటికి రండి అంటుంది కావ్య. అక్కడికి ఎందుకు అంటుంది కనకం.

మా అత్త గారు పిలిస్తే నీకు ఓకేనా అంటుంది కావ్య. దీంతో ఇదంతా అవసరమా చెప్పు అంటుంది కనకం. అది కాదు కావ్య అంటే కూడా వినదు కావ్య. అత్తయ్యను ఏం చెప్పి ఒప్పించాలి అంటూ టెన్షన్ పడుతుంది కావ్య. అందరూ రాత్రి డిన్నర్ తింటూ ఉంటారు. అత్తయ్య గారు మీరు కర్రీ వేయనా.. పచ్చడి వేయనా అని అడుగుతుంది కావ్య. దీంతో చాలు అంటున్నా కదా అంటూ సీరియస్ అవుతుంది అపర్ణ. మీకో విషయం చెప్పాలి. ఒక్కసారి రేపు రాజ్ ను తీసుకొని మా పుట్టింటికి వెళ్తాను అత్తయ్య అంటుంది కావ్య. కొంచెం పని ఉంది అంటుంది. దీంతో కాంట్రాక్ట్ పని పూర్తయింది కదా. మళ్లీ ఏంటిది అని అడుగుతుంది.

కాంట్రాక్ట్ మీ అబ్బాయి వల్లే వచ్చింది కాబట్టి.. ఆ ఇంటి పత్రాలు కూడా మీ అబ్బాయి చేతుల మీదుగానే ఇప్పించాలని అనుకుంటున్నాను అంటుంది కావ్య. అందుకని రాజ్ ను తీసుకొని వెళ్తావా? కుదరదు అంటుంది అపర్ణ. మరి నన్ను ఏం చేయమంటారు అత్తయ్య. మా అమ్మ ఏమో ఇక్కడికి రమ్మంటే రాను అంటోంది. మీరేమో పంపించను అంటున్నారు అంటుంది. కనకాన్ని పిలిస్తే ఎందుకు రాదు అంటుంది అపర్ణ. మరోవైపు ఇంట్లో వినాయకచవితి సంబురాలు మొదలవుతాయి. అందరూ తమ మనసులోకి కోరికలను చిట్టీలుగా రాసి దేవుడి వద్ద పెడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

13 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.