Home » Entertainment » Chiranjeevi Responds To Twins
Entertainment

Chiranjeevi : రాంచరణ్, ఉపాసన కవల పిల్లలపై స్పందించిన చిరంజీవి .. ముందుగా ఎవరు జన్మించారో తెలుసా ?

Authored By
Suma
The Telugu News | Updated on: February 1, 2026, 3:26 pm
Advertisement

Twins for Ram Charan : మెగా పవర్ స్టార్ రాంచరణ్ Ram Charan , ఉపాసన  upasana దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఈ శుభవార్త వెలువడిన వెంటనే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి  Apollo Hospital  పరిసరాలు పండగను తలపించాయి. పెద్ద ఎత్తున మెగా అభిమానులు అక్కడికి చేరుకుని బాణాసంచా కాల్చి నినాదాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ మధుర క్షణం రావడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా ఫ్యామిలీకి ఇది నిజంగా డబుల్ జాయ్‌గా మారింది.

Advertisement

Chiranjeevi : రాంచరణ్, ఉపాసన కవల పిల్లలపై స్పందించిన చిరంజీవి .. ముందుగా ఎవరు జన్మించారో తెలుసా ?

Twins for Ram Charan :  చిరంజీవి భావోద్వేగ మాటలు ..

మనవడు, మనవరాలు జన్మించడంతో మెగాస్టార్ చిరంజీవి  Megastar Chiranjeevi  ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తన హృదయానందాన్ని పంచుకున్నారు. “మమ్మల్ని ప్రేమించే అభిమానులు, శ్రేయోభిలాషులతో ఈ శుభవార్తను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం కలిసి ఈ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాం. ఎప్పటి నుంచో మా ఇంట్లో ఇలాంటి శుభకార్యం జరగాలని కోరుకున్నాం. భగవంతుడి దయ, హనుమంతుడి కృపతో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ మా కుటుంబంలోకి అడుగుపెట్టారు. ఇది మాకు వర్ణనాతీతమైన ఆనందాన్ని ఇచ్చింది” అని చెప్పారు. అభిమానులు ఈ క్షణాన్ని పండగలా జరుపుకోవడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని చిరంజీవి పేర్కొన్నారు.

Advertisement

Twins for Ram Charan : తల్లి, శిశువులు ఆరోగ్యంగా ..

శనివారం రాత్రి ఉపాసన సుఖ ప్రసవంతో కవలలకు  Twins  జన్మనిచ్చారు. మొదట అబ్బాయి అనంతరం అమ్మాయి పుట్టినట్లు వైద్యులు వెల్లడించారు. ఉపాసనతో పాటు ఇద్దరు చిన్నారులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ విజయవంతమైన ప్రసవానికి కృషి చేసిన డాక్టర్ సుమనకు అపోలో గైనకాలజిస్ట్ డాక్టర్ రుమా సిన్హాకు, పిడియాట్రిక్ నిపుణురాలు డాక్టర్ లతకు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సేవలు కూడా అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ తల్లి, పిల్లలు బాగున్నారని, చిన్నారులు ఎంతో అందంగా ఉన్నారని చెప్పారు. ఇక ఈ శుభవార్తను చిరంజీవి ముందుగానే తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. “రాంచరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఒక బాబు, ఒక అమ్మాయి. తల్లి, పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. తాత, అమ్మమ్మలుగా మాకు లభించిన ఈ వరాన్ని భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో ఈ కొత్త చిరునవ్వులు మరెన్నో సంతోషాలను తీసుకురావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి