Karthika Deepam 2 Episode 781 : ఆస్తులన్నీ కోల్పోయిన శివన్నారాయణ.. నిజం తెలిసి దీప షాక్
Karthika Deepam 2 Episode 781 : దీప ప్రాణాలకు, ఆమె కడుపులోని బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు. అయితే దీపను కాపాడిన వారి గురించి తెలిసిన తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది. మరోవైపు మాలిని చర్యల కారణంగా శివన్నారాయణ కుటుంబం ఇల్లు, ఆస్తులు కోల్పోవడం ఈ ఎపిసోడ్లో కీలక పరిణామంగా మారింది.సెప్టెంబర్ 17న ప్రసారమైన కార్తీక దీపం 2 781వ ఎపిసోడ్లో దీప యాక్సిడెంట్ నుంచి శివన్నారాయణ కుటుంబం పరిస్థితి వరకు వరుసగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీపకు, ఆమె కడుపులోని బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ ఎంతో ఉపశమనం పొందుతాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్కు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతాడు. అయితే, తనకు కాకుండా జ్యోత్స్నకు థ్యాంక్స్ చెప్పాలని డాక్టర్ సూచిస్తాడు. దీంతో కార్తీక్ జ్యోత్స్న చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెబుతాడు.ఈ సమయంలో జ్యోత్స్న తన మనసులోని బాధను బయటపెడుతుంది. తాను చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెబుతుంది. అయితే దీపను సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చింది సూరజ్ అని కార్తీక్కు వివరిస్తుంది.అంతేకాదు, అక్కడి నుంచి వెళ్లే సమయంలో దీపకు ఉన్న రుణాన్ని తీర్చుకున్నానని సూరజ్ చెప్పిన విషయాన్ని కూడా జ్యోత్స్న వెల్లడిస్తుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన వల్ల కార్తీక్కు, అతని కుటుంబానికి అన్యాయం జరిగిందని అంగీకరిస్తుంది.తనపై ఉన్న ఆ నిందను తానే తొలగించుకుని, తన నిజాయితీని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు జ్యోత్స్న చెబుతుంది.
Karthika Deepam 2 Episode 781 : ఆస్తులన్నీ కోల్పోయిన శివన్నారాయణ.. నిజం తెలిసి దీప షాక్
Karthika Deepam 2 Episode 781 ఇంటికి చేరుకున్న జ్యోత్స్నకు ఊహించని షాక్
ఆసుపత్రి బయట ఉన్న జ్యోత్స్నను సూరజ్ తన కారులో తీసుకెళ్లి ఇంటి వద్ద దింపుతాడు. కానీ ఇంట్లోకి వెళ్లిన జ్యోత్స్నకు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. తన కుటుంబ సభ్యుల్లో ఎవరూ కనిపించకపోవడంతో ఆమె అయోమయంలో పడుతుంది. ఇంట్లో మాలిని మాత్రమే ఉండటంతో మరింత షాక్ అవుతుంది. అప్పుడు మాలిని అసలు విషయం చెబుతుంది. ఆ ఇల్లు ఇప్పుడు తనదని, జ్యోత్స్న కుటుంబం రోడ్డున పడిందని చెబుతూ ఆమెను శివన్నారాయణ కుటుంబం ఉన్నచోటికి తీసుకెళ్తుంది. కంపెనీతో పాటు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని మాలిని చెప్పడంతో జ్యోత్స్న తీవ్ర ఆందోళనకు గురవుతుంది. శివన్నారాయణ తన మావయ్యకు క్షమాపణ చెప్పితే వారిని క్షమించి వదిలేస్తానని మాలిని చెప్పడంతో ఆయన కోపంతో రగిలిపోతాడు. గత ఎపిసోడ్లో ఈ పరిణామాలే ప్రధాన హైలైట్గా నిలిచాయి.
Karthika Deepam 2 Episode 781 సూరజ్ షర్ట్పై రక్తం.. మాలినికి అసలు విషయం చెప్పడంతో షాక్
దీప బతికిందా, చనిపోయిందా అనే విషయం తెలియక మాలిని ఆలోచిస్తున్న సమయంలో సూరజ్ ఇంటికి వస్తాడు. అతని షర్ట్పై రక్తపు మరకలు ఉండటం చూసిన మాలిని ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. దారిలో దీపకు యాక్సిడెంట్ జరిగిందని, తమ కారులోనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించినట్లు సూరజ్ చెబుతాడు. ఇది విన్న మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ సూరజ్ మాత్రం మనుషుల మీదున్న కోపాలను మానవ విలువలతో ముడిపెట్టలేనని స్పష్టం చేస్తాడు. దీప గతంలో తనకు ఎంతో సహాయం చేసిందని, శివన్నారాయణ కుటుంబంతో జరుగుతున్న గొడవలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. అందుకే ప్రమాదంలో ఉన్న దీపను కాపాడానని వివరిస్తాడు.
దీప యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పిన సూరజ్
దీపకు ప్రమాదం ఎలా జరిగిందని మాలిని అడుగుతుంది. దీనికి సూరజ్ జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు. రోడ్డు పక్కన ప్రమాదానికి గురై దీప పడిపోయిందని చెబుతాడు. అక్కడే ఉన్న జ్యోత్స్న ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నిస్తుండగా తాను కూడా అదే సమయంలో అటుగా వెళ్లినట్లు చెప్పాడు. పరిస్థితి గమనించిన వెంటనే జ్యోత్స్నతో కలిసి దీపను ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించినట్లు సూరజ్ చెబుతాడు. అయితే శివన్నారాయణ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మాలిని సూరజ్కు సూచిస్తుంది. దీనికి సూరజ్ తనకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే దీప తనను వదిలేసి వెళ్లదని అంటాడు. దీప కాంచన కోడలని, కార్తీక్ను సూరజ్ అన్నయ్యగా భావించినా కార్తీక్ మాత్రం అతడిని తమ్ముడిగా చూడటం లేదని మాలిని అంటుంది.
సూరజ్ను కొత్త బ్రాంచ్కు పంపాలని మాలిని నిర్ణయం
సూరజ్ కొంతకాలం ఈ సమస్యలన్నింటికీ దూరంగా ఉండాలని మాలిని భావిస్తుంది. అందుకే కొత్త బ్రాంచ్కు వెళ్లి అక్కడి సమస్యలను పరిష్కరించాలని చెబుతుంది. సూరజ్ కూడా అందుకు అంగీకరిస్తాడు. కొత్త బ్రాంచ్ విషయంలోనే మాలిని టెన్షన్ పడుతుంటే, దాన్ని తాను చూసుకుంటానని ఆమెకు భరోసా ఇస్తాడు. మరోవైపు దీప ప్రమాదం నుంచి బయటపడటం మాలినికి నచ్చదు. దీప ఆయుష్షు గట్టిదేనంటూ లోలోపల రగిలిపోతుంది. కళ్లు తెరిచిన దీప.. రెస్టారెంట్ ఫైర్ విషయం చెప్పడంతో కార్తీక్ షాక్ ఆసుపత్రిలో దీపకు స్పృహ వస్తుంది. సూరజ్, జ్యోత్స్న ఇద్దరూ కలిసి తనను కాపాడినట్లు కార్తీక్ ఆమెకు చెబుతాడు. అయితే దీప వెంటనే మరో విషయాన్ని ప్రస్తావిస్తుంది. కార్తీక్ను తాత ఇంటికి వెళ్లావా అని అడుగుతుంది. రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ విషయం చెప్పేందుకే అతనికి ఫోన్ చేసినట్లు వెల్లడిస్తుంది. ఇది విన్న కార్తీక్ షాక్ అవుతాడు.
Also Read : Jr NTR Dragon Movie : ఎన్టీఆర్ డ్రాగన్ విషయం లో ఫ్యాన్స్ భయపడుతున్న పాయింట్ ఇదే..!
ఫైర్ యాక్సిడెంట్తోనే సమస్య ముగియలేదని దీప చెబుతుంది. మిగిలిన రెస్టారెంట్లపై కూడా రైడ్స్ జరుగుతున్నాయని చెప్పి, అసలు ఏం జరుగుతోందో వెళ్లి తెలుసుకోవాలని కార్తీక్కు సూచిస్తుంది. తాత ఇంటికి వెళ్లిన కార్తీక్కు తాళం వేసిన ఇల్లు దీప చెప్పడంతో కార్తీక్ నేరుగా శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు. ఇంటి వద్దకు వెళ్లగానే వాచ్మెన్ అతడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు. కార్తీక్ అతడి మాట వినకుండా లోపలికి వెళ్తాడు. కానీ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి షాక్ అవుతాడు. అదే సమయంలో అక్కడికి మేనేజర్ వంశీ వస్తాడు. శివన్నారాయణ కుటుంబం ఇక అక్కడ ఉండటం లేదని కార్తీక్కు చెబుతాడు. శివన్నారాయణ ఇల్లు, ఆఫీసులు, రెస్టారెంట్లు అన్నింటినీ మాలిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిస్తాడు. తాను కూడా మాలిని మనిషినేనని వంశీ చెప్పడంతో కార్తీక్ మరింత షాక్ అవుతాడు.
శివన్నారాయణ కుటుంబాన్ని బయటకు పంపించారన్న వంశీ
ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్న తర్వాత శివన్నారాయణ కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు పంపించారని వంశీ చెబుతాడు. వాళ్లు ఏ రోడ్డు పట్టుకుని వెళ్లారో వెళ్లి వెతుక్కోవాలని వ్యంగ్యంగా చెప్పడంతో కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే వారిలో ఒక్కరినీ వదిలిపెట్టనని కార్తీక్ గట్టిగా హెచ్చరిస్తాడు. అన్ని పనులు ముగించుకుని సూరజ్ ఇంటికి బయల్దేరుతాడు. కారులో జ్యోత్స్న ఫోన్ కనిపించడంతో ఆశ్చర్యపోతాడు. దొంగ సంతకాల వ్యవహారంలో తాను చేసిన పని కారణంగా జ్యోత్స్న తనను తిడుతూ ఉండవచ్చని అనుకుంటాడు. జ్యోత్స్న మాత్రమే కాదు, ఆమె కుటుంబం మొత్తం తనను తిడుతూ ఉండొచ్చని భావించి ఫోన్ను స్విచ్ ఆన్ చేస్తాడు. అదే సమయంలో జ్యోత్స్న మరో వ్యక్తి ఫోన్ నుంచి తన మొబైల్కు కాల్ చేస్తుంది. కాల్ ఎత్తగానే సూరజ్ గొంతు వినిపిస్తుంది. జ్యోత్స్న ఫోన్ను తిరిగి ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లినట్లు సూరజ్ చెబుతాడు. అయితే జ్యోత్స్న తీవ్ర ఆవేదనతో స్పందిస్తుంది. తమ ఆస్తులన్నీ లాగేసుకుని కుటుంబాన్ని రోడ్డుమీదకు పంపి రెండు రోజులు అయిందని, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటారని ప్రశ్నిస్తుంది. దొంగ సంతకాలతో తన కుటుంబాన్ని రోడ్డున పడేలా చేశావని సూరజ్పై మండిపడుతుంది. అన్నీ కోల్పోయిన తర్వాత తాము ఎక్కడ ఉంటే ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
అసలు విషయం విన్న దీపకు మరో షాక్
ఇక ఆసుపత్రిలో కాంచన, కార్తీక్ మధ్య జరుగుతున్న సంభాషణను దీప వింటుంది. దీపకు యాక్సిడెంట్ కావడంతో తాము వరంగల్ వెళ్లామని, అదే సమయంలో మాలిని తన పుట్టింటి కుటుంబాన్ని రోడ్డుమీదకు పంపిందని కాంచన చెబుతుంది. ఇది విన్న దీప షాక్ అవుతుంది. సుమిత్ర కుటుంబం రోడ్డున పడటం ఏంటని కార్తీక్ను నిలదీస్తుంది. అప్పుడు కాంచన నిజం చెబుతుంది. దీప అక్కడికి వెళ్లినా ఇప్పుడు తాళం వేసిన ఇల్లు తప్ప మరెవరూ కనిపించరని అంటుంది. గౌరీ ప్రసాద్ రెస్టారెంట్కు సంబంధించిన వ్యవహారంలో పెట్టిన సంతకాల గురించి కార్తీక్ వివరిస్తాడు. దీప, సూరజ్ కలిసి పెట్టించిన సంతకాల కారణంగానే మాలిని తమ కుటుంబ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న దీప తీవ్రంగా కలత చెందుతుంది.
“కట్టుబట్టలతో బయటకు గెంటేశారు”.. కాంచన కన్నీళ్లు
శివన్నారాయణ కుటుంబ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని వారిని కట్టుబట్టలతో బయటకు పంపించారని కార్తీక్ చెబుతాడు. దీప ఈ విషయం తట్టుకోలేదనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు చెప్పలేదని వివరిస్తాడు. తాము వచ్చేసరికి అంతా అయిపోయిందని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాను శివన్నారాయణ కన్నకూతురినని, తన పుట్టింటి వాళ్లు రోడ్డున పడిపోయారనే బాధతో కనీసం ముద్ద కూడా దిగడం లేద ని ఆవేదన చెందుతుంది. దీంతో దీప వెంటనే వారిని వెతకాలని నిర్ణయిస్తుంది. ఏం చేసినా సరే శివన్నారాయణ కుటుంబం ఎక్కడ ఉందో గుర్తించాలని కార్తీక్ను వెంట తీసుకుని బయల్దేరుతుంది. దీప, కార్తీక్ ఇద్దరూ కలిసి శివన్నారాయణ కుటుంబం కోసం పలు ప్రాంతాల్లో వెతుకుతారు. ఈ సమయంలో ఓ వ్యక్తి కార్తీక్కు ఫోన్ చేస్తాడు. వారు వెతుకుతున్న కుటుంబం మణికొండ బస్టాండ్ దగ్గర ఉన్నట్లు సమాచారం ఇస్తాడు. అయితే ఆ వ్యక్తి ద్వారా ఈ విషయాన్ని కార్తీక్కు చెప్పించింది సూరజ్ అని తెలుస్తుంది. సమాచారం అందుకున్న దీప, కార్తీక్ వెంటనే మణికొండ బస్టాండ్ వైపు వెళ్లి శివన్నారాయణ కుటుంబాన్ని గుర్తిస్తారు. వారిని చూసిన కార్తీక్, తమపై కోపం ఉన్నా కనీసం ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా అని బాధగా అడుగుతాడు.
దీపపై మండిపడ్డ శివన్నారాయణ
కార్తీక్ మాటలకు శివన్నారాయణ తీవ్రంగా స్పందిస్తాడు. కార్తీక్ భార్య చేసిన పనివల్ల తమ జీవితాలు ఎలాంటి పరిస్థితికి వచ్చాయో చూడమంటూ దీపపై మండిపడతాడు. సూరజ్ ఆఫీసులో అడుగుపెట్టిన రోజే తన పతనానికి పునాది పడిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. శివన్నారాయణ కోపంగా దీపను నిలదీయడంతో కార్తీక దీపం 2 781వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక శివన్నారాయణ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టేందుకు దీప, కార్తీక్ ఏం చేస్తారు? మాలిని స్వాధీనం చేసుకున్న ఆస్తుల విషయంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? సూరజ్ చేసిన సహాయం గురించి కుటుంబ సభ్యులకు పూర్తి నిజం తెలుస్తుందా? అన్నది తర్వాతి ఎపిసోడ్లో వెల్లడయ్యే అంశంగా మిగిలింది.







