chiranjeevi silent punch
Chiranjeevi : ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి మధ్య ఆసక్తికర డిస్కషన్ నడిచిన విషయం తెలిసిందే. అక్కడి వారితో చిరంజీవి ఫొటోలు దిగుతుంటే, మెగాస్టార్ ఇలా చేస్తే నేను వెళ్లిపోతానని అన్నాడు. దాంతో చిరు సైలెంట్గా వచ్చి కూర్చున్నారు. తర్వాత గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి నరసింహరావు పేరు ప్రస్తావించకుండా ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని స్పందించారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు స్పందించాయి.ఇలా ఈ విషయం కొద్ది రోజుల పాటు చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో పంచ్ వేశారు. తాజాగా మెగాస్టార్ చిరు… ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు రాసిన `శూన్యం నుంచి శిఖరాగ్రాలకు` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరిగింది. చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయనేగెస్ట్ గా హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా స్టేజ్ పై ఉన్న చిరంజీవితో ఫోటోలు దిగేందుకు మహిళలు క్యూ కట్టారు.ఆ సమయంలో. చిరు ఇక్కడ వారే లేరు కదా… హమ్మయ్య అంటూ..పంచ్ వేశారు. దీంతో చిరంజీవి గరికపాటిపై పంచ్ వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.అంతకుముందు మీడియా ఇంటరాక్షన్ లో గరికపాటి వివాదంపై చిరంజీవిని మీడియా ప్రముఖులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
chiranjeevi silent punch
గరికపాటి నరసింహారావు పెద్దాయన, ఆయన వ్యాఖ్యలపై చర్చ అనవసరం అన్నారు మెగాస్టార్. ఆయన పెద్ద పండితుడు, మంచీ చెడులకు తారతమ్యం తెలిసినవారు అన్నారు. కాబట్టి ఈ వివాదం గురించి మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పి తన హుందాతనం చాటుకున్నారు. పరోక్షంగా వివాదం మరింత పెద్దది చేసే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు మెగాస్టార్. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు మురళీమోహన్… ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు మరియు పాత్రికేయులు హాజరు కావడం జరిగింది. ఇక చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.