
chiranjeevi varun tej multi starer movie
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నారు. చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆయనకి జంటగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. దాదాపు 10 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుసగా యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు.
కాగా ఆచార్య తర్వాత మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన ఆయన నెక్స్ట్ సినిమాగా మలయాళ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్లో నటించబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కనుందట.
chiranjeevi varun tej multi starer movie
కీలక పాత్ర కోసం మెగా వారసుడు వరుణ్ తేజ్ను తీసుకోనున్నారని తాజా సమాచారం. విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చి సీఎం పదవికి పోటీ చేసే పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని మెగా అభిమానుల్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్ న్యూస్ అయిపోయింది. ఇప్పటికే ఆచార్య చరణ్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా త్వరలో మొదలవబోయో లూసీఫర్ రీమేక్లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో. ఇక ఈ సినిమాను మెగాస్టార్ బర్త్ డే అయిన ఆగస్టు 22న సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారట.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.