Drishyam Movie Repeat : దృశ్యం సినిమా రిపీట్.. ప్రియుడితో పారిపోయేందుకు తానే చనిపోయినట్టు నటన
Drishyam Movie Repeat : ఈ రోజుల్లో మహిళలు ముదిరిపోతున్నారు. వివాహేతర సంబంధాల కోసం పండంటి సంసారం నాశనం చేసుకుంటున్నారు. గుజరాత్లోని పాటన్ జిల్లా, సంతాల్పుర్ తాలూకా పరిధిలోని జఖోట్రా గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జఖోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్ (22) అనే వివాహిత, భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా భరత్తో కలిసి రాజస్థాన్కు పారిపోయి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంది.
Drishyam Movie Repeat : దృశ్యం సినిమా రిపీట్.. ప్రియుడితో పారిపోయేందుకు తానే చనిపోయినట్టు నటన
ఇందుకోసం తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ఓ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ను ప్రియుడు భరత్కు వివరించింది. భరత్ మంగళవారం రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ (56) అనే వ్యక్తిని అడ్డగించి హత్య చేశాడు. అనంతరం, ముందుగా అనుకున్నట్లుగా హర్జీభాయ్ మృతదేహాన్ని జఖోట్రా గ్రామ శివార్లలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తరలించాడు. ఇక తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్తో కలిసి హర్జీభాయ్ శవానికి తన బట్టలు వేసి, కాళ్లకు గజ్జెలు తొడిగింది.
అనంతరం శవంపై పెట్రోలు పోసి నిప్పంటించి, ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. తన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇక తన కోసం వెతకరని గీత భావించింది. కుటుంబ సభ్యులు కూడా గ్రామ శివార్లలోని కుంట సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి, అది గీతదేనని తొలుత భావించారు. కానీ, కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి శవంగా గుర్తించారు. అప్పుడు పాలన్పుర్ రైల్వే స్టేషన్లో జోధ్పుర్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.