Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే. ఆ ఒక్క బాహుబలి సినిమాతో తన క్రేజ్ పూర్తిగా మారిపోయింది. దీంతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, ప్రాజెక్టు కె, సలార్, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. అయితే త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీని కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున దర్శకుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కేటాయించిన డేట్స్ కొన్నే. షూటింగ్ మొత్తం గ్రీన్ మ్యాట్ పైన పూర్తి చేశారు. కనుక ప్రమోషన్ కార్యక్రమాల కోసం ప్రభాస్ ఎక్కువ రోజులు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం. మే 15 నుండి మొదలుకొని సినిమా విడుదల అయ్యేవరకు ఆది పురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో ప్రభాస్ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జూన్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అంటే నెలరోజుల పాటు ప్రభాస్ ఆది పురుష్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు.
దేశవ్యాప్తంగా అనేక ముఖ్య పట్టణాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇలా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కోసం భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.