Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా ఇటీవల బాలీవుడ్ లో కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియన్ మూవీ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తుంది. అయితే సమంత చాలాకాలంగా మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆ సమస్య నుంచి బయటపడడానికి సమంత సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో సమంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత మయోసైటీస్ వ్యాధి కోసం 25 కోట్లు ఖర్చు పెడుతుందని, ఆ డబ్బు కూడా ఓ స్టార్ హీరో దగ్గర నుంచి అప్పు తీసుకుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సమంత తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది. మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా, మీతో ఎవరో బ్యాడ్ డీల్ కుదుర్చుకున్నారు, అందులో నేను చాలా అంటే చాలా తక్కువ ఖర్చు చేస్తున్నా, నా సంగతి నేను చూసుకోగలను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
అలాగే ఈ వార్తలు రాసేవారికి కూడా కౌంటర్ ఇచ్చింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు రాసే తప్పుడు వార్తలు వలన ట్రీట్మెంట్ కి వెళ్లేవారు ఆగిపోతారు. కొంచెం బాధ్యతగా వ్యవహరించండి. ప్రస్తుతం సమంత ఇండోనేషియాలోని బాలిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉదయం యోగాలు ఆసనాలు చేస్తూ ప్రకృతి మధ్యలో గడుపుతూ ఫిజికల్గా రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఖుషి సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మొత్తానికైతే సమంతపై వస్తున్న వార్తలకి ఆ పోస్టుతో చెక్ పడినట్లు అయింది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.