Sowmya Rao : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం దశాబ్ద కాలం పూర్తి చేసుకోబోతుంది. ఈ దశాబ్ద కాలంలో యాంకర్స్ గా అనసూయ మరియు రష్మీ గౌతమ్ మాత్రమే వ్యవహరించారు. అనసూయ మధ్యలో కొన్నాళ్లు కనిపించకుండా పోయినా ఆ సమయంలో రష్మి గౌతమ్ సందడి చేసింది. తాజాగా అనసూయ మళ్లీ కనిపించకుండా పోయింది. సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను చేయలేక పోతున్నాను అంటూ చెప్పేసి మల్లెమాల కి మరియు ఈటీవీ జబర్దస్త్ ప్రేక్షకులకు గుడ్ బై చెప్పేసింది.
అనసూయ లేని లోటును రష్మి గౌతమ్ మళ్లీ పూడ్చే ప్రయత్నం చేసింది. రష్మి గౌతమ్ ఎప్పటిలాగే జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ అని కూడా మేనేజ్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఈ సమయంలో కన్నడ నటి సౌమ్య రావు ని తీసుకొచ్చారు. ఆమె అనసూయ కి ఏ మాత్రం తగ్గకుండా అందాలను చూపించడంతో పాటు చలాకీగా యాంకరింగ్ చేస్తూ దూసుకు పోతుంది. ఖచ్చితంగా జబర్దస్త్ యొక్క భవిష్యత్తు ఎపిసోడ్స్ అన్నీ కూడా సౌమ్య చేయబోతున్నట్లుగా అంత భావించారు.
కానీ మల్లెమాల వారు చెబుతున్న దాని ప్రకారం కేవలం 8 వారాలు మాత్రమే సౌమ్య జబర్దస్త్ యొక్క యాంకర్ గా వ్యవహరించబోతుంది. సౌమ్యతో మల్లెమాల వారు కేవలం ఎనిమిది వారాలకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ తర్వాత ఆమెకు ప్రేక్షకుల నుండి మద్దతు లభించి.. మల్లెమాల వారి యొక్క ప్రశంసలు దక్కించుకుంటే అప్పుడు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమెకు పాజిటివ్ టాక్ దక్కింది, కనుక 8 వారాల తర్వాత ఆమెను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతే కాకుండా ఆమె కు పారితోషికం కూడా పెంచే అవకాశాలు ఉన్నాయట.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.