Saddam Team : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ టైం అస్సలు బాగున్నట్లుగా లేదు. రేటింగ్ సరిగా రాక పోవడంతో పాటు కమెడియన్స్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కాస్త బాగా చేస్తున్నారు అనుకుంటున్నా సమయంలో కమెడియన్స్ వెళ్ళి పోతున్నారు. హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వెళ్లి పోయిన తర్వాత ఎంతో మంది కమెడియన్స్ వస్తున్నారు కానీ ఆ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకోలేక పోతున్నారని చెప్పాలి. అయితే పటాస్ టీం సద్దాం, యాదమ రాజు జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త సందడి కనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అలాంటి సద్దాం టీం ని కొందరు కావాలని టార్గెట్ చేసి పదే పదే విమర్శలు చేయడంతో పాటు మల్లెమాలకు చెందిన వారు కూడా ఆ టీం పట్ల చిన్న చూపు చూస్తున్నారట. దాంతో సద్దాం మరియు ఆయన టీం మల్లెమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికే నడ్డి విరిగిన నక్క అన్నట్లుగా ముందు సాగుతోంది. రేటింగ్ లేక కామెడీ లేక ప్రేక్షకుల ఆదరణ లేక ముందుకు సాగుతున్న జబర్దస్త్ కార్యక్రమం కి సద్దాం టీం కూడా గుడ్ బై చెప్తే కచ్చితంగా డామేజ్ పెద్దగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
కనుక మల్లెమాల వారు ఆ టీం తో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని ప్రేక్షకుల మరియు జబర్దస్త్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, సద్దాం టీం గతంలో వేరే ఛానల్స్ లో చేసి వచ్చిన విషయం తెల్సిందే. అందుకే జబర్దస్త్ లో ఉన్న ఓల్డ్ కమెడియన్స్ తో కాస్త ర్యాగింగ్ ఎదుర్కొంటున్నారట. సీనియర్ కమెడియన్స్ తో పోల్చితే వారికి ప్రాముఖ్యత తక్కువ ఇవ్వడంతో పాటు అన్ని విషయాల్లో కూడా వారిని చిన్న చూపు చూస్తున్నారట. ఇప్పటికే ఎంతో మంది మంచి కమెడియన్స్ ని పోగొట్టుకున్న జబర్దస్త్ కార్యక్రమం ఇక నుండి అయినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటుందని ఆశిద్దాం.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.