కీర్తి సురేష్ లాక్ డౌన్ లో కూడా తన సినిమాలని రిలీజ్ చేసి గ్రేట్ అనిపించుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి వచ్చిన క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. అయితే కీర్తి సురేష్ మహానటి సినిమా కోసం కాస్త లావవ్వాల్సి రావడంతో సినిమాకి తగ్గట్టు గా తయారైంది. కాని మహానటి తర్వాత వరసగా కమర్షియల్ సినిమాలు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కమిటవడం వల్ల మేకోవర్ లో కొన్ని ఛేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే డైట్ చేసి బాగా సన్నబడింది. సన్నబడటం అంటే అలా ఇలా కాదు చాలా నాజుకుగా అన్నమాట. కీర్తి సురేష్ సన్నబడిన తర్వాత చూస్తే ఏకంగా ఎవరీయమ్మాయి అనేంతగా తనని తాను మార్చుకుంది. కాని ఈ లుక్ మెజారిటీ జనాలకి నచ్చలేదు. దాదాపుగా అందరి నుంచి నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. నేను శైలజ , నేను లోకల్ లాంటి సినిమాలలో కీర్తి సురేష్ ని చూసిన ప్రేక్షకులు ఫ్యాన్స్ అయిపోయారు. అయితే కీర్తి సురేష్ నుంచి వచ్చిన గత చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా డిసప్పాయింట్ చేశాయి.
ముఖ్యంగా కీర్తి సురేష్ సన్నబడిన తర్వాత లుక్ ఎవరికీ నచ్చలేదు. అంతేకాదు ఈ ప్రభావం తాజాగా కమిటయిన సినిమాల మీద కూడా బాగా పడుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే మళ్ళీ కీర్తి సురేష్ కి లావెక్కమని సలహా ఇచ్చారట. ప్రస్తుతం వాళ్ళ మాటలని సీరియస్ గా తీసుకున్న కీర్తి సురేష్ బాగా నచ్చిన ఫుడ్ అంతా లాగించేసి మళ్ళీ బొద్దుగా తయారయ్యే పనిలో ఉందట. ఇప్పటికే కొంత మార్పు వచ్చి కీర్తి మళ్ళీ జనాలకి నచ్చేలా తయారైందని చెప్పుకుంటున్నారట.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే గుడ్ లక్ సఖీ, నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నాయి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.