Jabardasth : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో ఇమాన్యుల్ మరియు నూకరాజు చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ కామెడీతో మంచి మార్కులు దక్కించుకున్నారు. ఇద్దరు కూడా సమయస్ఫూర్తితో పంచ్ లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గతంలో ఒక కమెడియన్ మంచి గుర్తింపు దక్కించుకుంటే వెంటనే వారికి టీం లీడర్ పదవి ఇచ్చి గౌరవించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పద్ధతి కనిపించడం లేదు. హైపర్ ఆది చాలా తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగిన విషయం తెలిసిందే.
సుడిగాలి సుదీర్ ఇంకా చాలా మందికి కూడా మల్లెమాల వారు చాలా తక్కువ సమయంలోనే టీం లీడర్ పదవి కట్టబెట్టారు. కానీ ఇమాన్యుల్ మరియు నూకరాజు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కడం లేదు. వీరిద్దరూ చాలా కష్టపడి కామెడీ చేస్తున్న కూడా మల్లెమాల ఈటీవీ వారు పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ కార్యక్రమాలను తమ భుజాలపై మోస్తున్నారు.
అయినా వీరికి మల్లెమాల తీవ్రమైన అన్యాయం చేస్తుందంటూ వారి యొక్క అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ వేరే ఛానల్ నుండి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఈటీవీ లోనే కొనసాగుతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో ఇమాన్యుల్ మరియు నూకరాజు లు స్పందిస్తూ.. తమకు టీం లీడర్ పదవులు అక్కర్లేదు.. కేవలం మంచి పేరు చాలు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరికీ ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.