Home » Entertainment » Meena Stunning Post Viral In Socila Media
Entertainment

Meena : భ‌ర్త మ‌ర‌ణించాక తొలిసారి అలా.. మీనా చేసిన ప‌నికి నోరెళ్ల‌బెట్టిన నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: August 11, 2022, 8:00 pm
Advertisement

Meena : సీనియ‌ర్ హీరోయిన్ మీనా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న మీనా ఇప్ప‌టికీ సినిమాల‌తో అల‌రిస్తూనే ఉంది. మీనా న‌టించిన చాలా చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటాయి. జీవితం సంతోషంగా సాగుతున్న స‌మ‌యంలో మీనా ఇటీవల తన భర్త సాగర్ ని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఆమె స‌హా కుటుంబ స‌భ్యులు తీవ్ర బాధ‌లో మునిగిపోయారు. ఈ నేప‌థ్యంలో నాటి హీరోయిన్స్‌గా గుర్తింపు సంపాదించుకున్న నటీమ‌ణులు రంభ, సంఘ‌వి , సంగీత వారి కుటుంబ స‌భ్యుల‌తో వెళ్లి మీనాను ప‌రామ‌ర్శించారు.

Advertisement

విద్యా సాగర్ మరణించిన ఒక నెల తర్వాత , మీనా ఆమె కుమార్తె నైనిక నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆమె సన్నిహితులు మరియు ప్రముఖ నటీమణులు సంఘవి, సంగీత, రంభలు కలుసుకున్నారు. నటీమణులు కుటుంబ సమేతంగా వచ్చి మీనాను కలిసి ఫొటోలు దిగారు. తన భర్త మరణానంతరం తొలిసారిగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోను చూసిన అభిమానులు నటి మీనా పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇప్పుడిప్పుడే మీనా సాధార‌ణ జీవితానికి మీనా అల‌వాటు ప‌డుతున్నారు.

Meena Stunning post viral in socila media

Advertisement

Meena : అలా క‌లుసుకున్నారు..

90వ ద‌శ‌కంలో మీనా స‌హా రంభ‌, సంగీత‌, సంఘ‌వి హీరోయిన్స్‌గా అగ్ర హీరోలంద‌రితో క‌లిసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. మీనా భ‌ర్త సాగ‌ర్ ఈ ఏడాది జూన్‌లో ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో క‌న్నుమూశారు. ఆ స‌మ‌యంలో సాగ‌ర్ మ‌ర‌ణంపై సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. ఆ స‌మ‌యంలో మీనాకు స‌హ‌చ‌ర న‌టీన‌టులు అండ‌గా నిలిచారు. అలాంటి వార్త‌ల‌పై మీనా కూడా ఎమోష‌న‌ల్‌గా స్పందించారు. ఇటీవ‌లే మీనా ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేయగా ఆ వేడుకల్లో మీనా కనిపించడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి