Balakrishna : బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ ని ఫిక్స్ చేశారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తాజాగా ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాతలు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలను ప్రకటించారు. ఇందులో భాగంగా మైత్రీ వారు .. బాలకృష్ణ తో సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య కి జంటగా ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో బాలయ్య తో ద్విపాత్రభినయం చేయిస్తున్నట్టు బోయపాటి శ్రీను వెల్లడించాడు. పక్కా మాస్ యాక్షన్ అండ్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 28 న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు కూడా. దాంతో ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయో దర్శకుడు.. కథ గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి తాజాగా బాలకృష్ణ తర్వాత సినిమా తమ సంస్థలో నిర్మిస్తున్నామని వెల్లడించారు. రీసెంట్ గా క్రాక్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడంటు.. బాలయ్య – బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమా సెట్స్ మీదకి రానుందని ప్రకటించారు. ఈ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా రూపొందనుందని సమాచారం.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.