Naga Chaitanya : సామ్ చై విడాకుల తర్వాత అక్కినేని కుటుంబం పెద్దగా బయట కనిపించడం లేదు. మా ఎన్నికల సమయంలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నాగ్ కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. అక్కినేని కుటుంబం మొత్తం బాధలో మునిగిపోయిందని జోరుగా వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయినా.. ఆ సినిమా ఎలా ఉందనే విషయంపై నాగ్ ఫ్యామిలీ, కనీసం అఖిల్ కూడా స్పందించకపోవడం గమనార్హం. దీనిని బట్టి అక్కినేని ఫ్యామిలీ కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీతో గ్యాప్ మెయింటెన్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
నాగచైతన్య తన వివాహ బంధానికి వీడ్కోలు పలికాక వరుస సినిమాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల లవ్స్టోరితో వచ్చిన చైతూ ఆ సినిమా ఆశించినంత పెద్ద విజయాన్ని అందించలేకపోయింది. తాజాగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’. మూవీలో నటిస్తున్నాడు అక్కినేని నటవారసుడు. అయితే, ఈ చిత్రం పెద్దగా బ్రేక్స్ లేకుండా శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని థాంక్యూ మూవీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు.
గతంతో అక్కినేని కుటుంబంతో విక్రమ్ కే కుమార్ కుమార్ విడదీయరాని బంధం ఉంది. ‘మనం’ సినిమా తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ‘హలో’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్. కానీ, అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం చైతూతో ‘థాంక్యూ’ చిత్రాన్ని తీశాడు. అయితే, ఈ మూవీపై చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉన్నది.
అంతేకాకుండా, అనుకున్న సమయానికి కంటే చిత్రీకరణ పూర్తిచేసుకుని థియేటర్లలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.ఈ మూవీ అనంతరం చైతన్య ఇంద్రగంటి మోహన్కృష్ణ డైరెక్షన్లో ఓ సినిమాకు ఓకే చెప్పాడని టాక్. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడు అర్జున్ ఇటీవల నాగ చైతన్యకు ఓ కథను వినిపించాడట. అది చైతూకు బాగా నచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్టు ఫిలిం వర్గాల టాక్.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.