
Nayanatara : విడాకులకు సిద్ధమైన నయనతార - విగ్నేష్ శివన్... అసలు ఏం జరిగిందంటే..?
Nayanatara : సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ తీసి చూస్తే దానిలో ముందుగా లేడీస్ సూపర్ స్టార్ నయనతార మరియు విగ్నేష్ జంట కచ్చితంగా ఉంటుందని చెప్పాలి. అయితే వీరిద్దరూ ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత 2022లో పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో నయనతార నటించడం జరిగింది. ఇక ఈ సినిమాతోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అని చెప్పాలి. ఇక అప్పటినుండి దాదాపు 7 ఏళ్ల పాటు వీరిద్దరూ ప్రయాణం సాగించారు. ఇక ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని 2022లో ఫైనల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది.వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలోని స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి . దీనిపై న్యాయపరమైన చిక్కులు కూడా ఏర్పడ్డాయి. ఇక వాటన్నిటిని దాటుకుని విగ్నేష్ నయనతార వారి పిల్లలతో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ విధంగా నయనతార విగ్నేష్ ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ ను లీడ్ చేస్తూనే కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ విధంగా పర్ఫెక్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శమని చెప్పాలి. అలాంటి ఈ జంట మధ్య కూడా ఇప్పుడు గొడవలు తలెత్తుతున్నాయని వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు ఇలా ప్రచారం కావడానికి ఒక బలమైన కారణం ఉందని చెప్పాలి. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నయనతార తిరిగి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇంస్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 78 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల నయనతార ఎవరు ఊహించని విధంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన భర్త విగ్నేష్ ను ఆన్ ఫాలో చేసింది.
అంతేకాక ఇంస్టా స్టోరీలోకన్నీళ్లు ఉబికి వస్తున్న కూడా ఇదే నాకు మిగిలింది అంటూ ఓ ఎమోషనల్ కొటేషన్ రాసుకొచ్చింది. దీంతో క్షణాల్లోనే నాయనతార పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది. దీంతో ఆమె అభిమానులు కూడా తెగ కంగారు పడిపోయారు. అసలు నయనతార విగ్నేష్ మధ్య ఏం జరిగింది..? ఎందుకు నయనతార తన భర్తను అన్ ఫాలో చేసింది..? ఈ జంట కూడా త్వరలోనే విడిపోతున్నారా..? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ విధంగా చర్చలు జాగుతున్న సమయంలో నయనతార మరో బిగ్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో భర్తను మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో నయనతార అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నయనతార ఏదో పొరపాటున తన భర్తను అనుఫాలో చేసి ఉంటుందని కొందరు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
This website uses cookies.