Pavitra : సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ గత కొద్దిరోజుల నుంచి జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వారిద్దరూ కలిసి ఉన్న హోటల్ వద్దకు వెళ్లి వారి మీద దాడి చేయటానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. అయితే నరేష్ మూడో భార్యతో పాటు పవిత్రా లోకేష్ మాజీ భర్త సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తనకు వివాహం జరగలేదని సుచేంద్ర ప్రసాద్ తో కూడా సహజీవనమే చేశానని పవిత్రా లోకేష్ పేర్కొన్నట్టు ప్రచారం జరగగా తాజాగా ఆమె తన భార్య అంటూ సుచేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
అసలు నరేష్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని తాజాగా కన్నడ మీడియాతో ఆయన పేర్కొన్నట్టు సమాచారం. తన భార్యతో సంబంధాలపై మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని సుచేంద్ర ప్రసాద్ లోకల్ మీడియాతో మాట్లాడారు అని తెలుస్తోంది. ”నా భార్యపై వస్తున్న వార్తలని మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా ఇటీవలే తెలుసుకున్నాను. పవిత్ర మేము సహజీవనం చేస్తున్నామని చెప్పిందట. కానీ మేము ఇద్దరం 16 ఏళ్ల క్రితమే హిందూ వివాహచట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. అందుకు ఆధారాలు కూడా వున్నాయి. మా పాస్పోర్టు, ఆధార్కార్డులో కూడా భార్య భర్తలుగా మా పేర్లు ఉంటాయి.
మా ప్రేమకు, దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేను పవిత్రని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయలేదు. పవిత్రపై ఇప్పటికీ నాకు గౌరవం ఉంది. ఈ వ్యవహారాల వెనుక ఎవరో ఉన్నారు. నాకు నరేశ్ ఎవరో కూడా తెలీదు” అని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలపై నరేశ్ కానీ, పవిత్రా కానీ స్పందిస్తారేమో చూడాలి. గత వారంరోజులుగా పవిత్రా లోకేష్, నరేశ్.. ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వారాలు వచ్చాయి. మొదట వీరిద్దరూ ఖండించినా తాజాగా ఆదివారం ఉదయం మైసూరులోని ఓ హోటల్ లో వీరిద్దరూ కనిపించారు. అక్కడికి నరేశ్ మూడో భార్య వెళ్లి పవిత్రని చెప్పుతో కొట్టబోయింది.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.