
pfi conspiracy to-attack pm narendra modi
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి పీఎఫ్ఐ కుట్ర చేసిందా? పీఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. మోదీపై దాడి చేయడానికి పీఎఫ్ఐ కుట్ర చేసిందంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. బీహార్ లోని పాట్నాలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయనపై దాడి చేయాలని పీఎఫ్ఐ కుట్ర పన్నిందట. గత జులై 12న ప్రధాని బీహార్ లో పర్యటించారు. అప్పుడే ప్రధానిపై దాడి చేయడానికి పీఎఫ్ఐ పక్కాగా ప్లాన్ చేసిందని ఎన్ఐఏ విచారణలో తాజాగా వెల్లడైంది.
ప్రధాని మోదీపై దాడి చేయడానికి కొందరికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారట. ఎన్ఐఏ విచారణలో ఈ సంచలన విషయాలు బహిర్గతం అయినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీపై దాడి చేసేందుకు నిధులను సమీకరించారని.. దాదాపు రూ.120 కోట్లను పీఎఫ్ఐ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారని తెలుస్తోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు యూపీకి చెందిన రాజకీయ నేతలపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసినట్టు తెలుస్తోంది.
pfi conspiracy to-attack pm narendra modi
ఎన్ఐఏ అధికారులు గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు కుట్ర జరిగిన విషయం తెలిసింది. ఇప్పటికే 105 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లే 22 మంది ఉన్నారు. వారందరిపై పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి ప్రధాని మోదీపై కుట్ర చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
This website uses cookies.