Radhe Shyam : ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యాం సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణమైన పరాజయం పాలయింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని అనిపించినా కూడా మిశ్రమ స్పందన దక్కడంతో వసూళ్ల విషయంలో డిజాస్టర్ గా మారింది. వీకెండ్ వరకు పర్వాలేదనిపించినా వీక్ డేస్ లో అత్యంత దారుణమైన నెంబర్స్ నమోదవుతున్నాయి. ఈ సమయంలో సినిమాకు సంబంధించి జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు మరింత నష్టం ను కలిగిస్తున్నాయి.దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఏదో ఒక సినిమా నుండి కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ కనీసం ఆలోచించకుండా కాస్త దృష్టి పెట్టకుండా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకొని పెద్ద తప్పు చేశాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూవీ క్రియేషన్ష్ వారు ఈ కాఫీ కథకు 300 కోట్ల బడ్జెట్ వారి విజ్ఞత అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ మొదలుకొని క్లైమాక్స్ లో వచ్చే షిప్ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కటి కూడా కాఫీ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరి చేయి చూసి అందులో ఉన్న వారిలో చాలా మంది మరికాసేపట్లో చనిపోతున్నారు అని తెలుసుకుంటాడు. ఆ సన్నివేశం కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో ఉంది. రైల్వే స్టేషన్లో ఒకతను రైలు లో ఉన్న వారి మొహాలు చూసి అంతా చనిపోతారని చెప్తాడు. దాంతో స్టేషన్ మాస్టర్ ను ఎంత బతిమిలాడినా కూడా రైలు ఆపేందుకు ఒప్పుకోరు. రైలు కొద్ది దూరం వెళ్లిన వెంటనే ప్రమాదం జరుగుతుంది.అప్పుడు స్టేషన్ మాస్టర్ వచ్చి రైలు ఆపమని అడిగిన వ్యక్తి కి దండం పెడతాడు.
ఇప్పుడు అదే సీన్ రాధేశ్యామ్ సినిమా లో కూడా పెట్టడం జరిగింది. ఇలా సినిమాలోని 99 శాతం సన్నివేశాలు కాపీ అంటూ నెటిజన్స్ సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక టైటానిక్ సన్నివేశం ను డైరెక్టుగా సినిమాలో దించేశారు. ఇలా ప్రతి సన్నివేశం కూడా ఏదో ఒక సినిమా నుండి సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన తీసుకోవడం జరిగింది. నాగార్జున నటించిన గీతాంజలి సినిమా నుండి ఇన్స్పిరేషన్ అయినట్లుగా చెప్పిన కొన్ని సన్నివేశాలు కూడా కాపీ అంటున్నారు. మొత్తానికి నాగార్జున మరియు ఇంకా ఎంతో మంది హీరోలు చేసిన సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమాలో మరోసారి చూసే అవకాశం దక్కింది అనేది కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.