samantha with cute childpic viral
Samantha : అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత గత ఏడాది అక్టోబర్లో చైతూకి విడాకులు ఇచ్చి సెన్సేషన్గా మారింది. సమంత, నాగచైతన్య ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్గా వీరి వివాహం జరిగింది. మ్యారేజ్ తర్వాత కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సమంత, చైతూ. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. సమంత తన ట్విట్టర్, ఇన్స్టాలో నేమ్ ఛేంజ్ చేయడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. సమంత తన ట్విట్టర్, ఇన్స్టా పేరులో `అక్కినేని` తీసేసి కేవలం `ఎస్`గా మార్చింది. దీంతో చైతూతో విభేదాలు తలెత్తాయా? అనే రూమర్ ఊపందుకుంది.
వీటిపై అక్టోబర్ 2న క్లారిటీ వచ్చింది. చైతూ, సమంత ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం విని అభిమానులు షాక్ అయ్యారు. విడాకుల ప్రకటన తర్వాత చైతూ, సమంత ఒకరినొకరు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. చిలుకా గోరెంకలుగా, అన్యోన్య దంపతులుగా ఉండే వీరిద్దరు విడిపోవడం నిజంగా చాలా బాధాకరం. వారిద్దరు కలవాలని అభిమానులు కలలుగంటున్న అది అసంభవం అనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే విడాకుల తర్వాత శాకుంతలం డైరెక్టర్ సమంత- చైతూ జంట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సమంత, నాగచైతన్యల అసలు ప్లాన్ వేరే ఉందని చెప్పిన ఆమె, `శాకుంతలం` సినిమా షూటింగ్ తర్వాత వాళ్లు మరో ప్లాన్ చేసుకున్నారట.
samantha with cute childpic viral
సమంత, చైతూ పిల్లలు కనేందుకు ప్లాన్ చేశారని తెలిపింది. ఆ సీక్రెట్ ప్లాన్లో భాగంగానే సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నారట. మొదట `శాకుంతలం` సినిమాని కూడా ఒప్పుకోలేదని, కానీ కథ విన్నాక, బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ తర్వాత పిల్లలు కనాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది నీలిమ గుణ. పిల్లలంటే ముందు నుండి ఇష్టపడిన సమంత పిల్లల్ని కనకుండా ఎందుకు విడాకులు ఇచ్చిందనేది మిస్టరీగా మారింది. అయితే తాజాగా సమంత ఓ చిన్నారిని ఎత్తుకొని క్యూట్ ఫోజులు ఇచ్చింది. ఈ పిక్ అభిమానులని తెగ ఆకట్టుకుంటుంది.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.