#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ ఇంటికి దూరం అయి నెల దాటింది. దీంతో తమ కుటుంబ సభ్యులను అందరూ తెగ మిస్ అవుతున్నారు. అందుకే ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి నుంచి కంటెస్టెంట్ల కోసం వచ్చిన లెటర్స్ ను అందిస్తాడు. కానీ.. అది టాస్క్ లో భాగంగా.. లెటర్స్ ను అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ గేమ్ ఆట ఆడటం, కంటెస్టెంట్లతో ఆడించడం చూసి కంటెస్టెంట్లే కాదు.. ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నెల రోజులు దాటింది. ఇంటి నుంచి వచ్చే లెటర్ అనగానే ఎవరికైనా ఆ లెటర్ చూడగానే ఏడుపు వస్తుంది. కానీ.. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇద్దరు బడ్డీలలో ఒక బడ్డీ లెటర్ ను త్యాగం చేయాలి. మరో బడ్డీ లెటర్ చదివి కెప్టెన్ కు కంటెండర్ అవుతాడు అని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెడతాడు. దీంతో ఇంటి సభ్యులకు ఏం చేయాలో అర్థం కాదు.
గౌతమ్, శుభశ్రీలో శుభశ్రీ తన లెటర్ ను త్యాగం చేయడంతో గౌతమ్ ఆ లెటర్ చదివి మొదటి కెప్టెన్సీ టాస్క్ కు కంటెండర్ గా నిలుస్తాడు. ఇక.. తేజ, యావర్ లో తేజ ఆ లెటర్ ను త్యాగం చేస్తా అని చెబుతాడు. యావర్ ను అలా చూడలేకపోతున్నా. వాళ్ల అన్నను చూడాలని చాలా రోజుల నుంచి అంటున్నాడు అని బిగ్ బాస్ కి చెబుతాడు. యావర్ కూడా వాళ్ల అన్న రాసిన లెటర్ చూసి కింద పడి వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఆ లెటర్ చూసి అస్సలు తన ఏడుపును ఆపుకోలేకపోతాడు యావర్. ఏం చేయాలో యావర్ కు అర్థం కాదు. యావర్ బాధ చూడలేక నేను లెటర్ ను త్యాగం చేస్తా నువ్వే ఆ లెటర్ ను చదువుకో.. అంటూ తన లెటర్ ను కూడా ఇచ్చేస్తాడు తేజ. కానీ.. యావర్ మాత్రం తన లెటర్ ను అందులో వేసి స్మాష్ చేస్తాడు. దీంతో తేజకు ఏం చేయాలో అర్థం కాదు.
#image_title
తేజ ఎంత చెప్పినా కూడా యావర్ వినడు. నేను ఒకరిని బాధపెట్టి నేను సంతోషంగా ఉండలేను. అందుకే నువ్వే ఆ లెటర్ చదువు.. ఈసారి నీకు కంటెండర్ అనేది ముఖ్యం. నేను ఇప్పటికే రెండు మూడు సార్లు కంటెండర్ అయ్యాను.. అంటూ యావర్ తేజకు చాన్స్ ఇస్తాడు. మొత్తానికి బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో అందరినీ ఏడిపించేశాడు. లెటర్స్ ఇవ్వకుండా కంటెస్టెంట్లనే కాదు.. ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులను కూడా బిగ్ బాస్ ఏడిపించేశాడు.
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
This website uses cookies.