pushpa 2 movie latest update
Pushpa 2 Movie : స్టైలిష్ స్టార్గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్స్టార్గా మార్చిన చిత్రం పుష్ప. `పుష్ప` మొదటి భాగం గతేడాది డిసెంబర్ 17న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్బంగా `అవతార్2` ప్రదర్శించే థియేటర్లలో `పుష్ప2` వీడియో గ్లింప్స్ ని ప్రదర్శించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఎర్రచందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్గా బన్నీ నటించారు. శ్రీవల్లిగా బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటించగా, నెగటివ్ రోల్లో ఫహద్ ఫాజిల్ నటించారు. మూవీకి దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
అయితే రెండో పార్ట్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా, మొదటి భాగంలోని ఆర్టిస్టులు కొనసాగడంతోపాటు కొత్త ఆర్టిస్టులు కూడా రెండో భాగంలో జాయిన్ అవుతారట. మరోవైపు మొదటి సినిమాలో సమంతతో `ఊ అంటావా మావ.. `అనే ఐటెమ్ సాంగ్ పెట్టగా, అది సంచలనం సృష్టించింది. రెండో భాగంలోనూ అలాంటి ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుందని, బాలీవుడ్ భామతో చేయించాలనుకుంటున్న ట్టు ప్రచారం నడుస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
pushpa 2 movie latest update
ఇక పుష్ప 2 చిత్ర బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుష్ప 2 సినిమాకు బడ్జెట్ 400 – 500 కోట్ల మధ్యలో అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పుష్ప బాలీవుడ్లో అంచనాలు లేకుండానే రు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమాకి ఏ మాత్రం వెనకాడకుండా డబ్బులు ఖర్చు చేయనున్నట్టు టాక్.బన్నీకి పారితోషికం, లాభాలతో కలిపి ఏకంగా 130 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 బడ్జెట్ విషయంలో మైత్రీ నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తుండగా, ఏదైన తేడా వస్తే మాత్రం కొంప కొల్లేరు కావడం ఖాయమని అంటున్నారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.