heroine wants to dating with Ram Charan
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా ముంబైలోనే మకాం వేసి ఉన్న విషయం తెలిసిందే. మొదట సోదరి శ్రీజ తో కలిసి ముంబై వెళ్ళిన రామ్ చరణ్ అక్కడే ఉన్నాడు. చరణ్ సోదరితో కలిసి ఎందుకు అక్కడికి వెళ్లడు.. ఏ పని మీద ఇద్దరు కలిసి వెళ్లారు అంటూ రకరకాలుగా చర్చలు జరిగాయి. ఆ సమయంలో కొందరు కొన్ని కొన్ని ఊహాగాణాలు చేశారు. శంకర్ మూవీ షూటింగ్ లేదు.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ లేదు దాంతో చరణ్ పూర్తిగా ఖాళీగా ముంబైలో సేద తీరుతున్న అని కొందరు ప్రచారం చేశారు. మరి కొందరు ఈ విషయమై మరో రకంగా చర్చించుకోవడం మొదలు పెట్టారు. చరణ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా గురించి చర్చలు జరుపుతున్నాడు అనే వార్తలు వచ్చాయి.బాలీవుడ్ లో సినిమా ను అతి త్వరలోనే చరణ్ ప్రకటించబోతున్నాడు
అంటూ మరి కొందరు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఒక బిజినెస్ వ్యవహారం కోసం గత కొన్ని రోజులుగా ముంబయిలోనే చరణ్ ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది. దేశంలోనే అతి పెద్ద బిజినెస్ సంస్థ అయిన టాటా గ్రూప్ తో ఒప్పందం కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవలే టాటా గ్రూప్ సంస్థ భారీ మొత్తంలో బిడ్ వేసి ఎయిర్ ఇండియా సంస్థ దక్కిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రామ్ చరణ్ తనకు చెందిన ట్రూ జెట్ విమానయాన సంస్థను టాటా ఎయిర్ ఇండియా సంస్థ తో కలిపి వ్యాపారం నిర్వహించాలని చరణ్ భావిస్తున్నాడట. అందుకోసం ట్రూజెట్ కు సంబంధించిన బిజినెస్ డీల్ తో రామ్ చరణ్ టాటా సంస్థ ప్రతినిధులతో చర్చించేందుకు ముంబైలో ఉన్నట్లుగా తెలుస్తోంది.టాటా గ్రూప్స్ గత కొన్నాళ్లుగా అన్ని వ్యాపారాలు లోనూ విజయాలను సొంతం చేసుకుంటుంది.
Ram Charan efforts for a business deal with Tatas
కనుక ఈ సమయం లో రామ్ చరణ్ వారితో కలిసి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ వ్యవహారం గురించి క్లారిటీ రావాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మరోవైపు మూడో షెడ్యూల్ కు మార్చిలో ముహూర్తాన్ని ఖరారు చేశారని సమాచారం అందుతోంది. అదే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా ను చరణ్ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నారు.
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
This website uses cookies.