Dil Raju: ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ వసూళ్ళు నిజం కాదా..? తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ చూస్తే అందరూ ఇదే అనుకుంటున్నారు. ఆయన నిర్మాణంలో ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్గా ఎఫ్ 3 రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఇందులో విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా – మెహ్రీన్ పిర్జాదా వెంకీ, వరుణ్లకు జంటగా నటించారు. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో సందడి చేయనుంది. ఇప్పటికే, పూజా ఐటెం సాంగ్ వచ్చి ఆకట్టుకుంది కూడా. ఇక ఈ సినిమాను ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే, సాంగ్స్ హిట్ అని ప్రూవ్ చేసుకున్నాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజుసంచలన వ్యాఖ్యలను చేశారు. డిస్ట్రిబ్యూటర్ గా మాకు వచ్చిన లెక్కలు మేము ఆయా చిత్రాల నిర్మాతలకు అందిస్తాము. కానీ ఆ లెక్కలను వారు ఎంత
అనౌన్స్ చేసుకోవాలి..? అనేది వారి ఇష్టమే..మాకు సంబంధం ఉండదు అన్నారు. దాంతో ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్, తాజాగావచ్చిన సర్కారు వారి పాట సినిమాల వసూళ్లు నిజం కాదా అనే సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
దీనిపై మిగతా మేకర్స్ ఏమంటారో చూడాలి.
IOCL recruitment 2024 : ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కామన్ లా అడ్మిషన్…
UPI : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI ద్వారా పన్ను చెల్లింపుల కోసం లావాదేవీ పరిమితిని…
Golden Milk : ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే…
Laxmi Narayana Yogam : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయి. అయితే ఇలా సంచారం చేసే…
Credit Card : ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువగా పెరుగుతూ పోతుంది. చిన్న ఎంప్లాయిస్ నుండి పెద్ద…
Ktr : ఇటీవల ఏపీ, తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎక్కడ చూసిన మధ్యలోకి బీజేపీని లాగుతుండడం హాట్ టాపిక్…
Tirupati Laddu : తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతుకొవ్వు, చేపనూనె వాడకం జరిగిందనే వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. జగన్…
Janasena : సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి కొత్త జోష్ వస్తోంది.…
This website uses cookies.