ఫిదా బ్యూటీ సాయి పల్లవి చాలా స్ట్రైట్ ఫార్వార్డ్. ఏ విషయాన్ని మనసులో దాచుకోదు. మంచైనా చెడైనా నిర్మొహమాటంగా బయట పెట్టేస్తుంది. సినిమాలు తప్ప వేరే వ్యాపకం ఉండదు. సినిమాలలో తప్ప వేరే విధంగా సంపాదించాలని అనుకోదు. అందుకే రొమాంటిక్ సినిమాలకి .. బోల్డ్ క్యారెక్టర్స్ కి నో చెబుతుంది. అంతేకాదు కమర్షియల్ యాడ్ ఫిలింస్ లో చేస్తే కోట్లు ఇస్తామన్నా నాకవసరం లేదని అంటుంది. సాయి పల్లవి ఎంత టాలెంటెడ్ హీరోయినో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు అదే సాయి పల్లవికి ఇబ్బందులు తెచ్చి పెడుతోందని అంటున్నారు.
గతంలో ఎంసీఏ సినిమా విషయంలో నాని తో సాయి పల్లవికి ఇష్యూ అయిందన్న వార్తలు వచ్చాయి. ఒక సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫ్రెన్సెస్ రావడమే ఇందుకు కారణం అన్నారు. అలాగే మరో సినిమా విషయంలో కూడా జరిగిందని .. కొన్ని సాయి పల్లవి అసలు కాంప్రమైజ్ కాదని అంటారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య తో లవ్ స్టోరీ సినిమా చేసింది. సాయి పల్లవి కి ఫిదా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటుంది. ఈ సినిమా సాయి పల్లవికి మంచి హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక రానా దగ్గుబాటి తో విరాట పర్వం అన్న సినిమా చేస్తోంది. వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నాని తో శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమా చేస్తోంది. తాజా ఈ సినిమా ఓపెనింగ్ కాగా ఈ నెల 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలబోతోంది. అయితే సాయి పల్లవి టాలీవుడ్ లో ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ కూడా కొందరిని భజన బ్యాచ్ అంటూ కామెంట్ చేసింది. మలయాళంలో సినిమాకి పని చేసే ప్రతీ ఒక్కరినీ సమానంగా చూస్తారని .. కానీ ఇక్కడ అలా ఉండదని బాగా డిఫ్రెన్స్ చూపిస్తారని ఇక్కడ ఎక్కువగా భజన చేసే వాళ్ళే అంటూ మాట్లాడింది. ఈ కామెంట్స్ తో సాయి పల్లవి నెటిజన్స్ కి దొరికిపోయిందని అంటున్నారు. మరి ఇమతకీ ఆ భజన బ్యాచ్ ఎవరో చెప్పలేదు.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.