
chandrababu about central vista project
ఇప్పుడు మనం ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకరు చంద్రబాబు అయితే.. మరొకరు ప్రధాని మోదీ. నిన్ననే మోదీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు తెలుసు కదా. అదేనండి.. కొత్త పార్లమెంట్ భవనం, మంత్రిత్వ శాఖ కార్యాలయాల కోసం శంకుస్థాపన జరిగింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపట్టినందుకు దేశవ్యాప్తంగా మోదీకి అభినందనలు వెల్లువెత్తాయి. చాలామంది రాజకీయ నాయకులు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ విషయంలో ప్రధాని మోదీని అభినందించారు.
chandrababu about central vista project
కట్ చేస్తే.. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ప్రధాని మోదీని అభినందించారు. చంద్రబాబు అవకాశం వస్తే వదలరు కదా. పనిలో పనిగా మోదీని పొగడ్తల్లో ముంచెత్తి.. తన గురించి కూడా చెప్పుకున్నారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టడం అనేది గొప్ప నిర్ణయం కానీ.. ప్రధాని మోదీ ఇప్పుడు ఆ ఆలోచన చేశారు కానీ.. నేను మాత్రం ఎప్పుడో ఆలోచించా.. ఐదేళ్ల కిందనే అమలు చేశా.. అంటూ మళ్లీ తన గురించి చెప్పుకోవడం మొదలు పెట్టారు చంద్రబాబు.
ఒక రాజధాని అంటూ లేని రాష్ట్రంలో అమరావతి అనే క్యాపిటల్ ను నెలకొల్పి… దాన్ని సెంట్రల్ స్పైన్ గా అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేశా. హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అన్నీ ఒకే చోట ఉండేలా నేను ప్రణాళికలు రచించా. అలాగే.. ఏపీ ప్రజల ఆకాంక్షలకు… ఏపీ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, సంక్షేమం కోసం అమరావతిని దేశంలోనే బెస్ట్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
కాకపోతే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమరావతి క్యాపిటల్ నాశనం అయిందంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇక్కడ మనం ఆలోచించాల్సినవి మూడు. చంద్రబాబు ఒకేసారి మూడు విషయాలు మాట్లాడేశారు. ఒకటి ప్రధాని మోదీని పొగడటం.. రెండు ప్రస్తుత ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించడం.. మూడోది.. అమరావతి రాజధాని కోసం తను ఎంత కష్టపడ్డారు.. కేంద్రీకృత పరిపాలన కోసం ఎంత కృషి చేశారు అనేది మళ్లీ ప్రజలకు చెప్పుకోవడం.
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
This website uses cookies.