why Singer Mano walkout from jabardasth
Jabardasth : తెలుగు బుల్లి తెర పై కామెడీ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఏ ఇండియన్ బుల్లి తెర షో కు కూడా రాని రేటింగ్ ను ఒకప్పుడు జబర్దస్త్ దక్కించుకుంది. అద్బుతమైన జబర్దస్త్ కామెడీ షో ను వారంలో దాదాపుగా పది సార్లు వేసే వారు. అంతగా ఈటీవీ భారం మోసిన జబర్దస్త్ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితికి దిగ జారి పోయింది. మొదట జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు సైడ్ అయిన సమయంలోనే జబర్దస్త్ పనైపోయిందని అంతా భావించారు. కాని అనూహ్యంగా నాగబాబు లేకున్నా కూడా ఆది మరియు ఇతర టీమ్ మెంబర్స్ అంతా ఉండటంతో ఎలాంటి డ్యామేజీ జరగక పోగా మంచి రేటింగ్ వచ్చింది.
ఎప్పుడైతే రోజా జడ్జ్ సీటు నుండి తప్పుకుందో అప్పటి నుండి జబర్దస్త్ కు కష్టాలు మొదలు అయ్యాయి. రోజా వెళ్లడానికి కొన్ని రోజుల ముందు నుండే ఆది కనిపించలేదు. ఆయన మళ్లీ వస్తాడని అంతా అనుకున్నారు. కాని రోజా వెళ్లి పోయాక ఆయన తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. సుడిగాలి సుధీర్ మరియు గెటప్ శ్రీను కూడా వెళ్లి పోయారు. ఇప్పుడు మరో జడ్జ్ గా ఉన్న సింగర్ మనో కూడా వెళ్లి పోవడానికి సిద్దంగా ఉన్నాడేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఈటీవీ వర్గాల నుండి కారణాలు కూడా క్లీయర్ గా వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా డైరెక్షన్ టీమ్ లేకపోవడంతో పాటు టీమ్ లీడర్స్ కూడా వెళ్లి పోవడంతో మనో కు పెద్దగా షో చేయాలనే ఆసక్తి కలగడం లేదట.
singer mano also out of from jabardasth show in very soon
చెన్నై నుండి వచ్చి మనో ఈ షో ను చేయడం ద్వారా పెద్దగా దక్కుతున్నది.. మిగులుతున్నది ఏమీ లేదట. ఏదో ఫ్యాషన్ కోసం.. ఎంటర్ టైన్మెంట్ కోసం ఆయన వచ్చి ఈ షో ను చేసి వెళ్తున్నాడట. ఇప్పుడు ఆ ఆసక్తి లేకుండా పోయిందట. అందుకే పదే పదే షెడ్యూల్స్ ను మిస్ చేస్తూ వస్తున్నాడు. ఈ వారం కూడా మనో లేకుండానే జబర్దస్త్ షో సాగింది. కనుక ఆయన మళ్లీ జబర్దస్త్కు వస్తాడో లేదో తెలియడం లేదు. ఎందుకంటే ఆయన కూడా జబర్దస్త్ కు శాస్వతంగా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన స్థానంలో లైలా వస్తున్నారు. మరో వైపు ఇంద్రజ కనిపిస్తున్న విషయం తెల్సిందే.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.