amazing Beauty Tips on Pimples on the face
Beauty Tips : మన పూర్వీకులు ముఖానికి ఎక్కువగా బియ్యంపిండిని వాడేవారు. దీనిని సున్నిపిండిగా చేసుకొని ముఖానికి రాసుకునేవారు. ఇలా రాసుకోవడం వలన ముఖానికి ఉన్న జిడ్డు తొలగిపోయి, ఫేస్ అందంగా నిగనిగలాడుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ వరిపిండితో శరీరమంతా రుద్దుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. బియ్యంపిండి శరీరాన్ని ప్రకాశవంతంగా చేయడానికి, జిడ్డును తొలగించడానికి, నల్ల మచ్చలు తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే శరీరంలోని ముడుతలు పోవడానికి ఈ బియ్యంపిండి బాగా ఉపయోగపడుతుందని పరిశోధకుతు చెబుతున్నారు. ఈ బియ్యంపిండిని ముఖానికి ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. అలాగే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం… ముందుగా కొన్ని బియ్యాన్ని కడిగి కొన్ని నీళ్లు పోసుకొని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి.
తరువాత కొన్ని నీళ్లు ఉంచి మెత్తగా, పేస్ట్ లాగా మిక్సి పట్టుకోవాలి. దీనిని ఒక గిన్నె తీసుకొని వడగట్టుకుంటే పాల లాంటి ద్రవం వస్తుంది. తరువాత ఈ ద్రవాన్ని గ్యాస్ పై పెట్టి దగ్గర అయ్యేవరకు బాగా ఉడికించుకోవాలి. ఈ ద్రవంలో ఉండే బెంజాయిక్ ఆమ్లం మన శరీరంలోని మురికిని పోగొడుతుంది. అలాగే దీనిలో ఉండే ఫైటిక్ యాసిడ్ చర్మంపై ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దీనిలో ఉండే పారా మోనా బెంజాయిక్ యాసిడ్ సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ఈ బియ్యం పేస్ట్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం… మొటిమలు ఎక్కువగా ఉన్నవారు రెండు స్ఫూన్ల బియ్యంపేస్ట్ లో ఒక స్ఫూన్ ఆముదం, ఒక స్ఫూన్ రోజ్ వాటర్ వేసుకొని బాగా కలిపి మొటిమలు ఉన్నచోట రాసుకోవాలి.
Beauty Tips to remove the pimples in face getting glowing skin
ఇలా ఒక రెండు నెలలు రాసుకుంటే ముఖంపై ఉన్న మొటిమలు తగ్గుతాయి. అలాగే శరీరంపై ముడుతలు ఎక్కువగా ఉన్నవారు రెండు స్ఫూన్ల బియ్యం పేస్ట్ లో ఒక స్ఫూన్ కొబ్బరిపొడి, ఒక స్ఫూన్ వాల్నట్ పౌడర్ వేసుకొని బాగా కలిపి చర్మానికి రాసుకుంటే శరీరంపై ఉండే ముడుతలు తగ్గుతాయి. చర్మం అందంగా, ప్రకాశవంతంగా, నిగనిగలాడుతుంది. అలాగే నల్లగా ఉన్నవారు తెల్లగా కావాలంటే రెండు స్ఫూన్ల బియ్యం పేస్ట్ లో ఒక స్ఫూన్ తేనే, ఒక స్ఫూన్ పాలు వేసుకొని బాగా కలిపి ముఖానికి రాసుకుంటే నలుపు రంగు పోయి తెల్లగా మెరుస్తారు. అలాగే పొడి చర్మం ఉన్నవారికి చర్మం పగులుతుంది. అలాంటివారు రెండు స్ఫూన్ల బియ్యంపిండి పేస్ట్ లో ఒక స్ఫూన్ పాలు, ఒక స్ఫూన్ తేనే, ఒక స్ఫూన్ కలబంద గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి.
దీనిని పగిలిన చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపటి తరువాత కడిగేసుకుంటే పగిలిన చర్మం రీకవర్ అవుతుంది. అలాగే కొంతమందికి ముఖంపై జిడ్డు ఎక్కువగా పడుతుంది. అలాంటివారు రెండు స్ఫూన్ల బియ్యం పేస్ట్ లో ఒక స్ఫూన్ పసుపు, ఒక స్ఫూన్ గంధం, ఒక స్ఫూన్ రోజ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ముఖంపై రాసుకొని ఒక అరగంట ఉంచుకోవాలి. తరువాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖంపై ఉన్న జిడ్డు అంతా తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. బియ్యంపిండితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ఈ చిట్కాను తప్పనిసరిగా ప్రయత్నించండి. మీ ముఖాన్ని ముడుతలు, మొటిమలు రాకుండా కాపాడుకోండి.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.