Sreeja : మెగాస్టార్ చిరంజీవి మరో సారి భర్త నుండి విడి పోయే అవకాశాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో తన అకౌంట్ పేరు మార్చడం మొదలుకుని తాజాగా కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలపక పోవడం వరకు ప్రతి విషయం తో కూడా కచ్చితంగా వీరిద్దరు విడిపోయారు అని అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు శ్రీజ మరియు కళ్యాణ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అభిమానులు చెక్ చేస్తూ ఏం జరుగుతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీజ నుండి ఏమైనా స్పెషల్ పోస్ట్ వచ్చిందా అంటూ చాలా మంది ఆమె వాల్ పైకి వెళ్లి చూడడం జరిగింది.
కానీ అక్కడ ఎలాంటి స్పెషల్ పోస్ట్ కనిపించలేదు. కానీ శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ ల కూతురు మాత్రం తండ్రి యొక్క పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సమయం లో తండ్రి తో ఆ పాప ఉండటం చర్చనీయాంశం అయింది. మొదటి భర్తతో ఒక పాపకు జన్మనిచ్చిన శ్రీజ విడాకుల సమయం లో ఆ పాపను తనతోనే ఉంచుకుంది. ఆ పాప ఇప్పుడు చిరంజీవి దంపతులతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ఆమె రెండో భర్తతో జన్మనిచ్చిన పాప మాత్రం భర్త దగ్గర ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొదటి భర్త కూతురుని దరి చేర్చుకున్న శ్రీజ.. రెండవ భర్త కూతురు ఎందుకు దూరంగా పెట్టింది అనే టాక్ మొదలు అయ్యింది. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కళ్యాణ్ షేర్ చేసిన ఫోటోలు పాతవి కూడా అయ్యి ఉండవచ్చు.
ఖచ్చితంగా శ్రీజ తోనే పాప ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాప అంటే శ్రీజకు చాలా ఇష్టం ఆమె ప్రతి సోషల్ మీడియా పోస్ట్ లో కూడా పాప కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. కనుక పాపని శ్రీజ అంత సులువుగా వదులుకోదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేని పోని పుకార్లు పుట్టించి మెగా ఫ్యామిలీ పరువు తీసేలా కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారంటూ మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై శ్రీజ లేదా కళ్యాణ్ దేవ్ లు ఒక క్లారిటీ ఇచ్చి విమర్శలకు పుకార్లకు చెక్ పెట్టాలంటే నెటిజన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.