Moive Tickets : సినిమా టికెట్ల రేట్లు విషయం లో టాలీవుడ్ ప్రముఖులు ఆ మద్య అమరావతి వెళ్లి పలు దఫాలుగా ఏపీ ప్రభుత్వం తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఎట్టకేలకు చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా మరి కొందరు స్టార్స్ వెళ్లడం తో జగన్ ప్రభుత్వం కాస్త నానబడినట్లుగా అనిపించింది.. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెరుగుతాయి అంటూ ప్రచారం జరిగింది. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెంపు సంబంధించిన జీవో రాబోతుంది అంటూ టాలీవుడ్ వర్గాల వారు చంకలు గుద్దుకుని వారి సంబరపడ్డారు కానీ పరిస్థితులు చూస్తుంటే జీవో రావడానికి మరి కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభుత్వం తలుచుకుంటే రాత్రికి రాత్రే జీవోలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గతం లో ఎన్నో జీవోలను రాత్రికి రాత్రి ప్రభుత్వాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ టికెట్ల కు సంబంధించిన జీవో ను మాత్రం విడుదల చేయడానికి సమయం కావాలంటూ ప్రభుత్వం కోరడం విడ్డూరంగా ఉంది. రేట్ల విషయంలో ఇప్పటికే ఏర్పడిన సంఘం నివేదిక ఇవ్వడం తో పాటు ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది టికెట్ల విషయంలో విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన కూడా ప్రభుత్వం నుండి ఇంకా కాస్త బెట్టు కనిపిస్తుంది.సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని టాలీవుడ్ ప్రముఖుల నుంచి అమరావతికి పిలిపించుకున్నాడు అనే వార్తలు వచ్చాయి.
ఈ సమయంలో ఆయన ఈగో చల్లారింది కనుక ఇక టిక్కెట్ల రేట్ల పెంపు కచ్చితం అంటూ అంతా నమ్మకంతో ఉన్న సమయంలో మరో అనుమానం మొదలైంది. ఇంకా జీవో విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జగన్ ఇగో ఇంకా చల్లారలేదా అంటూ కొందరు గుసగుసలు పెడుతున్నారు. టికెట్ల రేట్ల పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో జగన్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆవేదనతో ఉన్నారు. ఈ విషయమై చిరంజీవి మళ్ళీ ఏదైనా మాట్లాడతాడేమో చూడాలి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.