
Sri Reddy : జగనన్న నువ్వంటే ప్రాణం.. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటూ శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్
Sri Reddy : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం చాలా వాడివేడిగా సాగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకవైపు జగన్ మరో వైపు ఎన్నికల ప్రచారంతో హీటు పెంచుతున్నారు. అయితే విజయవాడలో ప్రచార కార్యక్రమం సమయంలో సీఎం జగన్పై జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ దాడి జరగడంతో రాబోయే రోజుల్లో ఆయన భద్రత విషయంలో పలు కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం గుత్తిలో జగన్ కాన్వాయ్పై కొందరు చెప్పులు విసిరారు. ఇప్పుడు జగన్పై రాయి విసరడం.. ఈ ఘటనలో ఆయన గాయపడటంతో నిఘా విభాగం హైఅలర్ట్ చేసింది. జగన్కి గాయం జరగడం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు.
అయితే వైసీపీ విధేయురాలిగా ఉన్న శ్రీ రెడ్డి జగన్పై రాళ్ల దాడి గురించి తన ఫేస్ బుక్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేసింది. సీఎం జగన్పై దాడిని ఖండిస్తూ ఇలాంటి నీచమైన పనులకి తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ దాడి వెనక టీడీపీ బోండా ఉమ ఉన్నట్టుగా శ్రీరెడ్డి పేర్కొంది. ఎన్నో కోట్లమందికి ప్రాణమైన వ్యక్తిపై హత్యా యత్నం చేస్తారా? అసలు మీరంతా మనుషులేనా? ఒక మనిషికి హాని తలపెట్టేంత కోపం మీకు ఎందుకు. ఇంతమంది జనం వస్తున్నారని జీర్ణించుకోలేక ఇలాంటి పని చేస్తారా? జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు బతుకుతున్నాయో మీకు ఎమైన అర్ధం అవుతుందా? మీ పదవుల కోసం జగనన్నకి హాని తలపెడతారా.. మేమంతా ఆయనపైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం అని ఎమోషనల్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి.
Sri Reddy : జగనన్న నువ్వంటే ప్రాణం.. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటూ శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్
వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో జగన్ పిక్ షేర్ చేస్తూ.. “నేను చచ్చిపోతాను జగనన్నా ,నేను బ్రతకలేను, మీరంటే అంత పిచ్చి, ప్రాణం ..రాత్రంతా నిద్ర కూడా లేదు అన్న” అంటూ జగన్ దాడి ఘటన ఫొటోను షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది పోలీస్ శాఖ. అయితే ఒక ముఖ్యమంత్రిపైనే ఇలా దాడి జరగడం నేషనల్ వైడ్గా సంచలనం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుండడం విశేషం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.
Raghuraama Vs Ramalayam : పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రస్తుతం ఒక ఆలయ నిర్మాణం చుట్టూ జరుగుతున్న పరిణామాలు…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
This website uses cookies.