Pawan Kalyan : వైఎస్ జగన్ గాయం గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జరుగుతుంది..?
Pawan Kalyan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళుతున్నారు.అయితే విజయవాడలో ఆయనపై రాయితో దాడి చేశారు. ఈ దాడి తర్వాత చాలామంది నాయకులు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ సైతం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు కూడా సానుభూతి తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. అయితే తాజాగా తెనాలి మీటింగ్లో మాత్రం జగన్ దాడి గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ కి గాయమైతే.. రాష్ట్రానికే గాయమైనట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడ్ని చంపేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే అప్పుడు గాయం కాలేదా అని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు పవన్. జగన్ చుట్టూ భద్రత ఉందని, ఆపై జెండాలున్నాయని, అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా..? అని లాజిక్ కూడా మాట్లాడారు పవన్. రాష్ట్ర డీజీపీ, నిఘా విభాగం దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నట్లు అని అడిగారు. ‘నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’ అంటూ సెటైర్లు వేశారు పవన్.
Pawan Kalyan : వైఎస్ జగన్ గాయం గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జరుగుతుంది..?
ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపకుండా ఇలా వెటకారంగా మాట్లాడటం హాట్ టాపిక్ అవుతుంది. అయితే జగన్పై దాడి జరిగిన కొద్ది గంటలలోనే చంద్రబాబు, పవన్పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు.. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెనాలిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసి విసిరాడు. అయితే, అది పక్కన పడింది.విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది. అసలు ఈ రాళ్ల దాడి వలన ఎలాంటి మెసేజ్ వెళుతుంది. సింపతీ కోసం ఇలా చేస్తున్నారా లేకుంటే ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచనలో పడ్డారు.
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.