
Pawan Kalyan : వైఎస్ జగన్ గాయం గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జరుగుతుంది..?
Pawan Kalyan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళుతున్నారు.అయితే విజయవాడలో ఆయనపై రాయితో దాడి చేశారు. ఈ దాడి తర్వాత చాలామంది నాయకులు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ సైతం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు కూడా సానుభూతి తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. అయితే తాజాగా తెనాలి మీటింగ్లో మాత్రం జగన్ దాడి గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ కి గాయమైతే.. రాష్ట్రానికే గాయమైనట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడ్ని చంపేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే అప్పుడు గాయం కాలేదా అని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు పవన్. జగన్ చుట్టూ భద్రత ఉందని, ఆపై జెండాలున్నాయని, అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా..? అని లాజిక్ కూడా మాట్లాడారు పవన్. రాష్ట్ర డీజీపీ, నిఘా విభాగం దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నట్లు అని అడిగారు. ‘నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’ అంటూ సెటైర్లు వేశారు పవన్.
Pawan Kalyan : వైఎస్ జగన్ గాయం గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జరుగుతుంది..?
ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపకుండా ఇలా వెటకారంగా మాట్లాడటం హాట్ టాపిక్ అవుతుంది. అయితే జగన్పై దాడి జరిగిన కొద్ది గంటలలోనే చంద్రబాబు, పవన్పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు.. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెనాలిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసి విసిరాడు. అయితే, అది పక్కన పడింది.విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది. అసలు ఈ రాళ్ల దాడి వలన ఎలాంటి మెసేజ్ వెళుతుంది. సింపతీ కోసం ఇలా చేస్తున్నారా లేకుంటే ఇతర కారణాలు ఏమైన ఉన్నాయా అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచనలో పడ్డారు.
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
Gold and Silver Rate Today 28 Feb 2026 : పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. కిందటి…
Brahmamudi 2026 February 28th Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'బ్రహ్మముడి'…
Karthika Deepam 2 February 28th 2026 Today Episode : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్లాక్…
Mint : వేసవి రుతువులో పుదీనా చట్నీ, పుదీనా నీరు ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంది. అందులోని చల్లనిచ్చే లక్షణం…
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
This website uses cookies.