Sridevi Drama Company : ఒకప్పుడు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పండగ వస్తోందంటే.. కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఇంకా ఇతర ప్రత్యేక రోజులు ఏమైనా రాబోతున్నాయి అంటే ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కన్నుల పండుగగా ఎంతో మంది బుల్లి తెర సెలబ్రిటీలు మరియు వెండి తెర సెలబ్రిటీలు పండుగ సందర్భంగా ఆ కార్యక్రమాల్లో సెలబ్రేట్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు పండుగ స్పెషల్ కార్యక్రమాలపై అంత ఇంట్రెస్ట్ ఉండడం లేదు. జనాలు పండుగ స్పెషల్ కార్యక్రమాలను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అలాంటి స్పెషల్ కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ రూపంలో వచ్చేస్తుంది.పండుగ స్పెషల్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షో మాదిరిగానే ఉంటుంది.
కనుక ఇప్పుడు పండుగ స్పెషల్ కార్యక్రమాలు వచ్చినా కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ని మించి ఆ షో ఏమీ కచ్చితంగా గొప్పగా ఉండదు అని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా పండగ స్పెషల్ ఎపిసోడ్ చూడాల్సిన అవసరం ఏముంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల ఈటీవీ లోనే కాకుండా ఇతర ఛానళ్ళలో కూడా ప్రసారం చేస్తున్న పండగ స్పెషల్ కార్యక్రమాల్లో జోరు తగ్గింది.శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎలా అయితే కన్నుల పండుగగా ఎంతో మంది సెలబ్రిటీలు కనిపిస్తారో అచ్చు అలాగే పండుగ స్పెషల్ ఎపిసోడ్లో కూడా లెక్కలేనంత మంది సెలబ్రెటీలు కనిపిస్తూ సందడి సందడి చేసేందుకు ప్రయత్నిస్తారు.
కనుక శ్రీదేవి డ్రామా కంపెనీ ని చూసిన వారు ఆ పండగ స్పెషల్ చూడాల్సిన అవసరం ఏమిటి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ తో పాటు స్టార్ మా జీ తెలుగు ఛానల్ లో కూడా పండగ స్పెషల్ కి సంబంధించిన ఎపిసోడ్ ల జోరు తగ్గింది. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల పండగు స్పెషల్ ఈవెంట్ లు భవిష్యత్తులో కనిపించుకుండా పోతాయి అంటూ బుల్లి తెర వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఈటీవీ లో ప్రతి ఆదివారం ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ సుధీర్ హోస్టు గా వ్యవహరిస్తూ ఉండగా ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాంప్రసాద్, హైపర్ ఆది లు కీలక భూమిక పోషిస్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.