Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం రెండు విషయాలు. ఒకటి తన కోడలు గర్భం దాల్చడం, మరొకటి వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవ్వడం. తను తాత అవుతున్నానని తెలిసినప్పుడు చిరంజీవి చాలా సంతోషించారు. వెంటనే ట్విట్టర్ లో తాను తాత కాబోతున్నట్టు ప్రకటించారు. దాదాపు పదేళ్లుగా మెగా వారసుడి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. ఉపాసన త్వరలో తల్లి కాబోతుందని, రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని ఏకంగా చిరంజీవే సోషల్ మీడియాలో ప్రకటించారు.
దీంతో మెగా అభిమానుల సందడే కాదు. మెగా అభిమానులు పండుగ చేసుకున్నారు.ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణమే ఉపాసనపై కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఆమె సరోగసి ద్వారా బిడ్డను కంటోంది అంటూ వార్తలు వచ్చాయి. లేదు ఆమెకు ట్విన్స్ పుడతారు అంటూ.. లేదు ఆమెకు ఏదో ప్రాబ్లమ్ ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆమె స్పెషల్ గా ఏదో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే ఇటీవల రామ్ చరణ్ సోదరి సుష్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మా తమ్ముడు తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన వెంటనే మాకు చాలా సంతోషం వేసింది. మేమంతా ఆ ఆనంద క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేశాం. మా ఆనందానికి అయితే అవధులు లేవు. అయితే మా తమ్ముడికి పుట్టేది పాపా లేక బాబా అనేది తెలియదు కానీ.. నాకు అయితే చరణ్ కు బాబు పుట్టాలని ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. చరణ్ కు కొడుకు పుడితే.. మాకు ఆ కోరిక తీరుతుంది.. అంటూ సుష్మిత కామెంట్స్ చేసింది. తన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.