
tollywood cinema ticket rates reduced
Tollywood : కరోనా వలన సినిమా పరిశ్రమ దిక్కు తోచని స్థితిలో ఉంది. ఈ మహమ్మారి వలన సినిమా షూటింగ్స్ స్తంభించాయి. థియేటర్స్ మూతపడ్డాయి. ఎంతో మంది సినీ కార్మికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని అందరు భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ సినీ రంగంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. కొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. మరోవైపు సినిమా టిక్కెట్ వ్యవహారం కూడా ఇండస్ట్రీకి ఇబ్బందిగా మారింది.
ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచాలని టికెట్ల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని పలువురు సీనీ ప్రముఖులు కోరుతున్న సంగతి తెలిసిందే. అక్కడ అలా ఉంటే తెలంగాణలో ప్రభుత్వం ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలు రూ.300 నుండి రూ.350 చేరుకున్నాయి. అయితే కరోనా ఎఫెక్ట్ తో రాధేశ్యామ్ మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలు పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున బంగార్రాజు సినిమాతో పాటు పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి.మల్టీ ప్లెక్స్లలో అంత ధరలతో చిన్న సినిమాలను చూసే పరిస్థితి లేదు.
tollywood cinema ticket rates reduced
ఈ క్రమంలో ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి తీసుకురావడానికి హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లు టిక్కెట్ ధరలను సవరించాయి. తాజా సమాచారం ప్రకారం థియేటర్లలో టికెట్ ధరలు రూ.200, రూ.175, రూ.150గా ఉంటాయి. ఇప్పటి నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకి థియేటర్స్లో బంగార్రాజు, రౌడీ బాయ్స్,డీజే టిల్లు, సూపర్ మచ్చి, హీరో వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఏ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి.
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
This website uses cookies.