Categories: EntertainmentNews

Tollywood : అగ్ర నిర్మాణ సంస్థలకు తప్పని తిప్పలు..?

Advertisement
Advertisement

Tollywood : ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలు కొన్ని వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ప్రకటించి చిక్కుల్లో పడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. వీటిలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుంది సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ అని కూడా అంటున్నారు. ఈ రెండు సంస్థలు చాలా జాగ్రత్తగా బడ్జెట్ పెరగకుండా ఉండే సినిమాలను ఒకే చేస్తూ వాటిని పూర్తి చేస్తూ వస్తున్నారు. కానీ, దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి కొన్ని పెద్ద సంస్థలు మాత్రం వరుసగా సినిమాలను ప్రకటిస్తూ..వాటిని పూర్తి చేస్తూ సాగుతున్నాయి. అయితే, మైత్రీ సంస్థ ఇప్పుడు గట్టిగా లాకయినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్.టి.ఆర్ లాంటి అగ్ర హీరోల నుంచి నాని లాంటి మీడియం రేంజ్ హీరోల వరకు సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే, అందరు హీరోలతో సినిమాలు చేయాలనే ఆరాటంతో చక చకా దర్శకుడికి, హీరోలకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు.
కానీ, అలా అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్న కాంబోలో సినిమా మొదలవడం లేదు. దీనికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమానే. ప్రకటించినప్పటి నుంచీ గనక చూసుకుంటే ఈ సినిమా ఈ పాటికి రిలీజై రికార్డుల గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ, ఇప్పటి వరకు ఆసలు ఈ సినిమా పట్టాలెక్కనే లేదు. ఇదే సంస్థలో నాని నటించిన లేటెస్ట్ సినిమా అంటే సుందరానికి నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు కూడా ఎన్.టి.ఆర్, ప్రచాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాను ప్రకటించి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.

Advertisement

Tollywood This situation with leading construction companies

Tollywood : అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్..!

ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగానూ ప్రకటించారు. కానీ, ఇది పట్టాలెక్కడానికి చాలా నెలలు సమయం ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మైత్రీలో ఇంకా చాలా ఉన్నాయట. ఇక దిల్ రాజు సంస్థలో కూడా కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. వాటి బడ్జెట్ విషయంలో కాస్త అటు ఇటు అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా శంకర్ – రామ్ చరణ్ సినిమాకు అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు. తెలుగులో ఉన్న మరికొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలది ఇదే పరిస్థితి. కరోనా దెబ్బతో ప్రాజెక్ట్స్ అన్నీ తారుమారవడం కూడా దీనికి కారణం. ఇదే విషయంలో సురేష్ బాబు లాంటి వారు మాత్రం బడ్జెట్ పెరుగుతుందీ అంటే మొత్తానికి ఆపేయడానికి కూడా ఆలోచించడం లేదు. దీనికి ఉదాహరణ గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రలో ప్రకటించిన హిరణ్య కశిప సినిమానే.

Advertisement
Advertisement

Recent Posts

BB Jodi Season 2 : రీతూ ఫొటోకి దండ.. థూ అంటున్నారు

BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…

12 minutes ago

YSRCP : బిగ్ బ్రేకింగ్… వైసీపీ కి అతిపెద్ద నేత రాజీనామా..?

YSRCP  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…

1 hour ago

Ram Charan Upasana Twins : పుట్టి నెల కాలేదు .. రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల పై చిరంజీవి షాకింగ్ నిర్ణయం

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…

2 hours ago

Whatsapp : వాట్సాప్‌ నుంచి మరో సూపర్‌ అప్‌డేట్‌ .. యాప్‌ అవసరం లేకుండానే..!

Whatsapp : వాట్సాప్‌ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…

3 hours ago

Akira Nandan Tollywood Entry : అకీరా నందన్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? ఆయన దర్శకత్వంలోనే లాంచ్ కానున్నారా ?

Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…

4 hours ago

Success Story : కూలీ నుంచి కోట్ల టర్నోవర్ .. తెలంగాణ వాసీ విజయ గాథ.. తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…

5 hours ago

Threatening Letters : ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..పోలీసులు అప్రమత్తం

Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…

6 hours ago

Telangana Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందడి .. ముక్కోణపు పోటీ .. ఫలితాలపైనే పార్టీల భవిష్యత్ .. !

Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…

6 hours ago