#image_title
Urvashi Rautela : ప్రస్తుతం ప్రపంచమంతా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇండియాకు చెందిన క్రికెట్ అభిమానులు అందరూ వరల్డ్ కప్ మ్యాచ్ లను అన్నింటినీ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ కి చాలా క్రేజ్ వచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. దాయాదుల పోరు అంటే మామూలుగా ఉంటుందా? రచ్చ రచ్చే కదా. అదే జరిగింది. స్టేడియం మొత్తం క్రికెట్ అభిమానులతో మారుమోగిపోయింది. ఈ మ్యాచ్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. వాళ్లంతా కలిసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ ని కూడా నిర్వహించారు. ఆ మ్యాచ్ కు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా కూడా వచ్చింది.
తను ఈ మ్యాచ్ లో ఆడిపాడింది. మ్యాచ్ అయిపోయే దాకా తను స్టేడియంలోనే ఉంది. అయితే.. మ్యాచ్ సంబురంలో తన దగ్గర ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేసి ఐఫోన్ ను పోగొట్టుకుంది. అసలు ఐఫోన్ అంటేనే చాలా కాస్ట్ లీ. అలాంటిది.. 24 క్యారెట్ల గోల్డ్ తో చేసిన ఫోన్ అంటే ఇక దాని ధర లక్షల్లో కాదు.. కోట్లలో ఉంటుంది. ఆ ఫోన్ నే స్టేడియంలో మిస్ చేసుకుంది ఊర్వశి రౌటెలా. మ్యాచ్ ముగిసిన తర్వాత తన జేబులో చెక్ చేసుకుంటే తన ఫోన్ కనిపించలేదు. అక్కడ ఎంత వెతికినా కనిపంచలేదట. దీంతో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది ఊర్వశి.
మ్యాచ్ లో తాను 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేసిన బంగారు ఐఫోన్ ను పోగొట్టుకున్నా. దయచేసి మీకు ఎవరికైనా దొరికితే నాకు తిరిగి ఇచ్చేయండి.. అంటూ ఊర్వశి వేడుకుంది. అలాగే.. తన ఫోన్ దొరికేలా సహకరించాలంటూ అహ్మదాబాద్ పోలీసులను కూడా ఊర్వశి కోరింది. అయ్యో పాపం.. అంత విలువైన ఐఫోన్ ను అలా ఎలా పోగొట్టుకున్నావు పాప.. పోయిన పోన్ దొరకుతుందా? అది మామూలు ఫోన్ కూడా కాదాయె.. అందులోనూ ఆ ఫోన్ లో సీక్రెట్ వీడియోలు ఉన్నాయట. ఆ వీడియోలు ఎక్కడ బయటపడతాయో అని ఊర్వశి తెగ టెన్షన్ పడుతుండటంతో.. ఆ ఫోన్ మీద ఆశ వదిలేసుకో అని నెటిజన్లు ఆమెకు సలహాలు ఇస్తున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.