#image_title
Urvashi Rautela : ప్రస్తుతం ప్రపంచమంతా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇండియాకు చెందిన క్రికెట్ అభిమానులు అందరూ వరల్డ్ కప్ మ్యాచ్ లను అన్నింటినీ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ కి చాలా క్రేజ్ వచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. దాయాదుల పోరు అంటే మామూలుగా ఉంటుందా? రచ్చ రచ్చే కదా. అదే జరిగింది. స్టేడియం మొత్తం క్రికెట్ అభిమానులతో మారుమోగిపోయింది. ఈ మ్యాచ్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. వాళ్లంతా కలిసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ ని కూడా నిర్వహించారు. ఆ మ్యాచ్ కు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా కూడా వచ్చింది.
తను ఈ మ్యాచ్ లో ఆడిపాడింది. మ్యాచ్ అయిపోయే దాకా తను స్టేడియంలోనే ఉంది. అయితే.. మ్యాచ్ సంబురంలో తన దగ్గర ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేసి ఐఫోన్ ను పోగొట్టుకుంది. అసలు ఐఫోన్ అంటేనే చాలా కాస్ట్ లీ. అలాంటిది.. 24 క్యారెట్ల గోల్డ్ తో చేసిన ఫోన్ అంటే ఇక దాని ధర లక్షల్లో కాదు.. కోట్లలో ఉంటుంది. ఆ ఫోన్ నే స్టేడియంలో మిస్ చేసుకుంది ఊర్వశి రౌటెలా. మ్యాచ్ ముగిసిన తర్వాత తన జేబులో చెక్ చేసుకుంటే తన ఫోన్ కనిపించలేదు. అక్కడ ఎంత వెతికినా కనిపంచలేదట. దీంతో ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది ఊర్వశి.
మ్యాచ్ లో తాను 24 క్యారెట్ల గోల్డ్ తో తయారు చేసిన బంగారు ఐఫోన్ ను పోగొట్టుకున్నా. దయచేసి మీకు ఎవరికైనా దొరికితే నాకు తిరిగి ఇచ్చేయండి.. అంటూ ఊర్వశి వేడుకుంది. అలాగే.. తన ఫోన్ దొరికేలా సహకరించాలంటూ అహ్మదాబాద్ పోలీసులను కూడా ఊర్వశి కోరింది. అయ్యో పాపం.. అంత విలువైన ఐఫోన్ ను అలా ఎలా పోగొట్టుకున్నావు పాప.. పోయిన పోన్ దొరకుతుందా? అది మామూలు ఫోన్ కూడా కాదాయె.. అందులోనూ ఆ ఫోన్ లో సీక్రెట్ వీడియోలు ఉన్నాయట. ఆ వీడియోలు ఎక్కడ బయటపడతాయో అని ఊర్వశి తెగ టెన్షన్ పడుతుండటంతో.. ఆ ఫోన్ మీద ఆశ వదిలేసుకో అని నెటిజన్లు ఆమెకు సలహాలు ఇస్తున్నారు.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.