Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దాదాపు పదేళ్లు కష్టపడి టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాకు ముందు చాలా సంవత్సరాల పాటు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. తమ్ముడు ఆనంద్ సంపాదించి డబ్బు పంపిస్తూ ఉంటే నటుడిగా విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. పెళ్లి చూపులు సినిమా తో మంచి గుర్తింపు రాగా అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ అయ్యాడు. లైగర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ ను అవ్వబోతున్నాను అనే నమ్మకంతో విజయ్ దేవరకొండ క్లీయర్ గా కనిపిస్తున్నాడు.వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత రౌడీ స్టార్ నుండి సినిమా రాలేదు.
ఇప్పటి వరకు ఆయన కమిట్ అయిన మరియు విడుదల అయిన సినిమాల విషయంలో ఎలాంటి విమర్శలు వివాదాలు రాలేదు. కాని రౌడీ స్టార్ తాజాగా బ్యాక్ టు బ్యాక్ పూరితో సినిమాలు చేయడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పూరితో సినిమా అంటే స్టార్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వారు. కాని పరిస్తితి ఇప్పుడు సరిగా లేదు. కనుక రౌడీ స్టార్ పూరి తో ఒక్క లైగర్ చేసి ఉంటే సరిపోయేది అంటూ సినీ విశ్లేషకులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ ఆగస్టు లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆ సినిమా తర్వాత ఖుషి సినిమా తో రౌడీ స్టార్ రాబోతున్నాడు.
ఆ వెంటనే పూరి సినిమా జనగణమన సినిమా ను చేయబోతున్నాడు. పూరి తో పాన్ ఇండియా స్థాయి లో జనగణమన సినిమాను రౌడీ చేయబోతున్న నేపథ్యంలో అభిమానులు ఒకింత ఆందోళనతో ఉన్నారు. లైగర్ సినిమా ఫలితాన్ని బట్టి ఆ సినిమా పై జనాల్లో అంచనాలు ఉండే అవకాశం ఉంది. లైగర్ హిట్ అయితే ఖచ్చితంగా జనగణమన సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒక వేళ లైగర్ ప్లాప్ అయితే మాత్రం జనగణమన సినిమా ను జనాలు మాత్రమే కాకుండా బయ్యర్లు కూడా పట్టించుకునే అవకాశం ఉండదు. పూరి మాయలో పడి ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం అనేది చాలా రిస్కీ నిర్ణయం అని.. విజయ్ అలా చేయకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.