Viral News: సాధారణంగా కొందరు మహిళలు అమాయకంగా నటిస్తూ ఎదుటివారి జీవితాలకు ఎసరు పెడుతుంటారు. అటువంటి కోవలోకి వస్తుంది పుష్ప అనే మహిళ. తనకు తాను ఓ ఐఏఎస్ అధికారి పీఏను అని ఓ వ్యాపారి కొడుకును నమ్మించింది.అతనితో నాలుగు రోజులు బాగానే మాట్లాడింది. ఆ తర్వాతే తనలోని కన్నింగ్ బుద్దిని బయటపెట్టింది. ప్రభుత్వ టెండర్ ఇప్పిస్తానని నమ్మించింది. అతన్ని పలానా చోటుకు వస్తే డీల్ గురించి మాట్లాడుకుందామని పిలిచి ఏకంగా గుండాలతో కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.
రవి ఇండస్ట్రియల్ సప్లై యాజమని రవి కొడుకు సూరజ్.. ఇతనికి పుష్ప ఓ రోజు మెసేజ్ చేసింది. సూరజ్ తన తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. అతనికి వద్ద డబ్బులు బాగానే ఉంటాయని అనుకున్న పుష్ప అతన్ని నెమ్మదిగా మాటల్లోకి దింపింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెండర్ ఇప్పిస్తానని చెప్పి రమ్మని.. కిడ్నాప్ చేయించింది. అనంతరం అతని తండ్రికి కాల్ చేసి రూ.నాలుగు కోట్లు ఇస్తే మీ కొడును విడుదల చేస్తామని.. లేదంటే చంపేస్తామని బెదిరించింది. తన దగ్గర అంత డబ్బు లేదని అతని తండ్రి చెప్పాడు. అనంతరం సూరజ్ తన ఫ్రెండ్ గురుమూర్తికి ఫోన్ చేసి డబ్బులు తీసుకుని రమ్మన్నాడు. గురుమూర్తి రూ. 25లక్షలు తీసుకుని పుష్ప రమ్మన్న చోటుకు వెళ్లాడు.
అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి గురుమూర్తి పుష్పకు కాల్ చేశాడు. అనంతరం సూరజ్ను పుష్ప తన ఇంటికి తీసుకువచ్చి డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరించింది.ఈ క్రమంలోనే గురుమూర్తి పుష్పకు మళ్లీ కాల్ చేశాడు. దీంతో పుష్ప తన ఇంటి అడ్రస్ చెప్పడంతో గురుమూర్తి రూ. 25 లక్షలు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. పుష్ప రాత్రి 9గంటల టైంలో సూరజ్ను విడిచిపెట్టింది. బయట ఎవరికైనా చెబితే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. అంతేకాకుండా మీ ఇంట్లో వారందరినీ చంపేస్తానని బెదిరించడంతో సూరజ్ సైలెంట్ అయ్యాడు. కానీ ఎలాగోలా ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు చాకచక్యంగా ఆమె అరెస్టు చేశారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.