
Mohan Babu doing same mistake
Mohan Babu : టాలీవుడ్ ను గత కొన్నాళ్లుగా వేధిస్తున్న ఏపీ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి ఒక పుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు ప్రభాస్,, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ఇంకా ప్రముఖులు వెళ్లి అమరావతి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి కచ్చితమైన హామీ సినీ ప్రముఖులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని.. జీవో ను విడుదల చేస్తామని చిరంజీవి టీంకి జగన్ హామీ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ వారు మరియు సోషల్ మీడియా వర్గాల వారు మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అవి ఏంటి అంటే ఈ సమయంలో మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు.. టికెట్ల రేట్లు విషయంలో ఒక్కరు ఇద్దరు వెళ్లి మాట్లాడడం కాదు మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి మాట్లాడాలి అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చిరంజీవితో పాటు ఎందుకు వెళ్ళలేదు అంటూ మోహన్ బాబు ని కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు ఈ సమస్య కు ఒక పరిష్కారం తీసుకొచ్చి ఉండాల్సింది. అప్పుడు కచ్చితంగా నీవే ఇండస్ట్రీ పెద్ద అయ్యే వాడివి కదా అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఇటీవల మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి.
where is mohan babu and manchu vishnu this time
చిరంజీవి ఒక్కడే వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే అది ఆయన వ్యక్తిగత విషయం అవుతుంది. కానీ ఇండస్ట్రీ కి సంబంధించిన విషయం ఎలా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ బాబు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆ భేటీ వ్యక్తిగత విషయమేనా మంచు విష్ణు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెంపు విషయము మెగా కాంపౌండ్ కి క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశం తో మంచు ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయి. వాళ్ళకే తిరిగి విమర్శలు తప్పలేదు. మోహన్ బాబు మరియు మంచు విష్ణు ఇప్పటికైనా ఈగో వదిలేసి ఇండస్ట్రీతో కలిసిపోవాలని.. ఇండస్ట్రీ పెద్ద అయినా చిరంజీవి ని గౌరవించాలి అని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.