Mohan Babu : మంచు వారు ఎక్కడ.. ఇప్పుడు ఎక్కడకు పోయింది మోహన్ బాబు నీ పెద్దరికం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mohan Babu : మంచు వారు ఎక్కడ.. ఇప్పుడు ఎక్కడకు పోయింది మోహన్ బాబు నీ పెద్దరికం

Mohan Babu : టాలీవుడ్ ను గత కొన్నాళ్లుగా వేధిస్తున్న ఏపీ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి ఒక పుల్‌ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు ప్రభాస్,, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ఇంకా ప్రముఖులు వెళ్లి అమరావతి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి కచ్చితమైన హామీ సినీ ప్రముఖులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. […]

 Authored By himanshi | The Telugu News | Updated on :10 February 2022,5:00 pm

Mohan Babu : టాలీవుడ్ ను గత కొన్నాళ్లుగా వేధిస్తున్న ఏపీ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి ఒక పుల్‌ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు ప్రభాస్,, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ఇంకా ప్రముఖులు వెళ్లి అమరావతి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి కచ్చితమైన హామీ సినీ ప్రముఖులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని.. జీవో ను విడుదల చేస్తామని చిరంజీవి టీంకి జగన్ హామీ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ వారు మరియు సోషల్ మీడియా వర్గాల వారు మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అవి ఏంటి అంటే ఈ సమయంలో మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు.. టికెట్ల రేట్లు విషయంలో ఒక్కరు ఇద్దరు వెళ్లి మాట్లాడడం కాదు మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి మాట్లాడాలి అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చిరంజీవితో పాటు ఎందుకు వెళ్ళలేదు అంటూ మోహన్ బాబు ని కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు ఈ సమస్య కు ఒక పరిష్కారం తీసుకొచ్చి ఉండాల్సింది. అప్పుడు కచ్చితంగా నీవే ఇండస్ట్రీ పెద్ద అయ్యే వాడివి కదా అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఇటీవల మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

where is mohan babu and manchu vishnu this time

where is mohan babu and manchu vishnu this time

చిరంజీవి ఒక్కడే వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే అది ఆయన వ్యక్తిగత విషయం అవుతుంది. కానీ ఇండస్ట్రీ కి సంబంధించిన విషయం ఎలా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ బాబు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆ భేటీ వ్యక్తిగత విషయమేనా మంచు విష్ణు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెంపు విషయము మెగా కాంపౌండ్ కి క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశం తో మంచు ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు బూమరాంగ్‌ అయ్యాయి. వాళ్ళకే తిరిగి విమర్శలు తప్పలేదు. మోహన్ బాబు మరియు మంచు విష్ణు ఇప్పటికైనా ఈగో వదిలేసి ఇండస్ట్రీతో కలిసిపోవాలని.. ఇండస్ట్రీ పెద్ద అయినా చిరంజీవి ని గౌరవించాలి అని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది